Kejriwal: కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi liquor scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor scam case) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎట్టకేలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరు అయ్యారు. అయితే, కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.15 వేల వ్యక్తిగత బాండ్ తో పాటు రూ.1 లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కోర్టు నుంచి అరవింద్ కేజ్రీవాల్ వెళ్లిపోయారు.
Read Also: Haiti : హైతీ నేరస్థుల ఆధీనంలో 90 మంది భారతీయ పౌరులు
Also Read
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
అయితే, కేజ్రీవాల్కు దర్యాప్తు సంస్థ (ఈడీ) జారీ చేసిన సమన్లను పాటించలేదన్న ఫిర్యాదులపై ఈరోజు హాజరు కావాలని రోస్ అవెన్యూ కోర్టు (మేజిస్ట్రేట్ కోర్టు) కోరింది. అరవింద్ కేజ్రీవాల్ తరఫున ఇద్దరు న్యాయవాదులు రమేష్ గుప్తా, రాజీవ్ మోహన్ వాదనలు వినిపించారు. ఇక, అరవింద్ కేజ్రీవాల్ కోర్టుకు వెళ్లే క్రమంలో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కోర్టు చుట్టూ ఉన్న పలు మార్గాలను దారి మళ్లించారు. దీంతో పాటు ఆయా మార్గాల్లో వచ్చే ప్రజలు సకాలంలో రావాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అయితే, ఇప్పటికే ఈడీ అధికారులు ఢిల్లీ సీఎంకు 8 సార్లు సమన్లు జారీ చేసిన కేజ్రీవాల్ వెళ్లలేదు..
Read Also: MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు పూర్తి.. రౌస్ అవెన్యూ కోర్టుకు..!
ఇక, తాము జారీ చేసిన సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదని ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో మరోసారి పిటిషన్ వేయడంతో.. తాజాగా ఆయన రోస్ అవెన్యూ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అనేక సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ వారు దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావడం లేదని ఈడీ ఆరోపించింది. కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదనలకు కోర్టు ఏకీభవించడంతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
తాజావార్తలు
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!