ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. రెండేళ్ల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం సాయంత్రం ఆయన బెయిల్పై విడుదలయ్యారు.
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కర్ణాటక ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ కేశవ్ ప్రసాద్ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ శుక్రవారం బెంగళూరు కోర్టుకు హాజరయ్యారు.
Sharjeel Imam : 2020 మతపరమైన అల్లర్ల కేసులో విద్యార్థి నాయకుడు షర్జీల్ ఇమామ్కు ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై దేశద్రోహం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
మాజీ హెచ్సీఏ అధ్యక్షులు అజారుద్దీన్ కు మల్కాజ్గిరి కోర్టులో ఊరట.. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చిన మల్కాజ్గిరి కోర్టు..