RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: తిరుపతిలో వైసీపీ నేత ఆర్కే రోజా కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బలనిరూపణ గవర్నర్ వద్ద కాకుండా అసెంబ్లీలో జరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. ముందుగానే బల నిరూపణ కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలంతా సి. జోసెఫ్ విజయ్కు మద్దతుగా ఓటు వేశారని, ప్రజా తీర్పును గవర్నర్ గౌరవించాలని రోజా అన్నారు. తమిళనాడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఇక, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా రోజా విమర్శలు గుప్పించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలు లేకుండా కూటమి ప్రభుత్వం గెలవగలదా అంటూ సవాల్ విసిరారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒక్కటిని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
Also Read
- Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
- Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
- AP Govt: విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు..
- Nepal: 25 మందిని చంపిన ‘‘కిల్లర్ ఏనుగు’’.. ఒకే కుటుంబంపై రెండుసార్లు దాడి..
అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం, అభివృద్ధి మోడల్ను చూపిస్తూ విజయ్ ప్రజల్లోకి వెళ్లారని రోజా పేర్కొన్నారు. జగన్ ఫోటోలను ఉపయోగిస్తూ ప్రజలకు అభివృద్ధి హామీ ఇచ్చారని తెలిపారు. జగన్ ప్రసంగ శైలి నుంచి సభల నిర్వహణ వరకు అనేక విషయాల్లో విజయ్ ఆయనను ఫాలో అయ్యారని, అందుకే అంతటి విజయాన్ని సాధించారని వ్యాఖ్యానించారు. ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కూడా రోజా తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో లడ్డూ అంశంపై చంద్రబాబు అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం రోజా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
తాజావార్తలు
-
Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
-
Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
-
AP Govt: విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు..
-
Nepal: 25 మందిని చంపిన ‘‘కిల్లర్ ఏనుగు’’.. ఒకే కుటుంబంపై రెండుసార్లు దాడి..
-
Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..