Rohit Sharma: మా మొదటి లక్ష్యం నెరవేరింది.. ఇక ముందుంది అసలు పండగ: రోహిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Says Iam Very happy for officially qualified World Cup 2023 Semi Finals: వన్డే ప్రపంచకప్ 2023లో అధికారికంగా సెమీఫైనల్కు అర్హత సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తమ మొదటి లక్ష్యం నెరవేరిందని, ఇక సెమీస్ మరియు ఫైనల్స్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామన్నాడు. ఏడు మ్యాచ్ల్లో గొప్పగా ఆడామని, భారత్ విజయాల్లో ప్రతి ఆటగాడి పాత్ర ఉందని రోహిత్ చెప్పాడు. ముంబైలో గురువారం శ్రీలంకను ఏకంగా 302 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్ అందరికంటే ముందుగా సెమీస్లోకి దూసుకెళ్లింది.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘అధికారికంగా సెమీఫైనల్కు అర్హత సాధించినందుకు సంతోషంగా ఉంది. మేము చెన్నైలో టోర్నీ ప్రారంభించినప్పుడు మా లక్ష్యం సెమీస్ మాత్రమే. ఇప్పుడు అది నెరవేరింది. ఇక మా లక్ష్యం ఫైనల్స్. మేం గెలిచిన ఏడు మ్యాచ్ల్లో ఆడిన విధానం బిన్నం. ప్రతి ఒక్కరూ జట్టు కోసం కృషి చేశారు. అందరూ భారత్ విజయాలలో పాలుపంచుకుంటున్నారు. స్కోర్ బోర్డుపై భారీగా పరుగులు ఉంచడం ఎప్పుడూ సవాలే. భారీ పరుగులు చేయాలనుకున్నాడు టెంప్లేట్ ఉండాలి. ఏదైనా పిచ్లో 350 చాలా మంచి స్కోరు. ఈ మ్యాచ్లో 357 పరుగులు చేశామంటే బ్యాటింగ్ యూనిట్కు చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఆపై బౌలర్లు పని పూర్తిచేశారు’ అని అన్నాడు.
Also Read
- Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
- Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
Also Read: World Cup 2023: ఇన్హేలర్లు వాడుతున్న క్రికెట్ ప్లేయర్స్.. కారణం ఏంటంటే?
‘శ్రేయస్ అయ్యర్ సత్తా ఉన్న ఆటగాడు. అతని సత్తా ఏంటో ఈ రోజు చూపించాడు. మేం కూడా ఆశించింది ఇదే. తన ముందున్న ఛాలెంజ్ని తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మొహ్మద్ సిరాజ్ నాణ్యమైన బౌలర్. అతను కొత్త బంతితో అద్భుతాలు చేస్తాడు. సూర్యకుమార్ యాదవ్ గత మ్యాచ్లో బాగా ఆడాడు. కీలక సమయంలో విలువైన పరుగులు చేశాడు. ఇంగ్లండ్, శ్రీలంకపై ప్రదర్శన సీమర్ల నాణ్యత ఏంటో తెలిపింది. ఇలాంటి బౌలింగ్ చూడటం ఆనందంగా ఉంద. వారు ఆ ప్రదర్శనను కొనసాగిస్తారని నేను ఆశిస్తున్నాను. డీఆర్ఎస్ నిర్ణయాన్ని కీపర్ కేఎల్ రాహుల్కే వదిలేసాను. ఫలితం మాకు అనుకూలంగా వచ్చింది. దక్షిణాఫ్రికా అసాధారణ క్రికెట్ ఆడుతోంది. మేం బాగా ఆడుతున్నాము. కోల్కతా ప్రజలు ఆ మ్యాచ్ ఆస్వాదించబోతున్నారు’ అని రోహిత్ చెప్పాడు.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్పై 100% టారిఫ్లు? అమెరికా హౌస్లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!