Rohit Sharma: తాను సాధించలేకపోయినా.. మహిళల గెలుపుతో కన్నీరు పెట్టుకున్న హిట్ మ్యాన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: భారత మహిళల క్రికెట్ జట్టు తమ తొలి వన్డే ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకోవడంతో.. భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. స్వదేశంలో ప్రపంచకప్ను కోల్పోవడం ఎంత బాధ కలిగిస్తుందో బాగా తెలిసిన రోహిత్కు ఈ విజయం ప్రత్యేకంగా నిలిచింది. ఆదివారం (నవంబర్ 2) నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రక విజయాన్ని స్టేడియంలో వీక్షించిన హిట్మ్యాన్ రోహిత్ శర్మ కళ్లలో ఆనంద భాష్పాలు కనిపించాయి.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ ఫైనల్ పోరులో, టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ 298 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది మహిళల ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరు. ఓపెనర్లు స్మృతి మంధాన (45), షఫాలీ వర్మ (87) 104 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. షఫాలీ 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ త్వరగా ఔటైనా, దీప్తి శర్మ (58) ఇన్నింగ్స్ను నిలబెట్టింది. చివర్లో రిచా ఘోష్ (24) వేగవంతమైన ఇన్నింగ్స్తో భారత్ను పటిష్ట స్థితికి చేర్చింది.
299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ అద్భుత సెంచరీ (101 పరుగులు)తో భారత్కు కొంత టెన్షన్ పెట్టింది. ఆమెతో పాటు సునే లూస్ జోడీని, కీలక బౌలింగ్తో షఫాలీ వర్మ విడదీసి గేమ్ ఛేంజర్గా నిరూపించుకుంది. దీప్తి శర్మ తన ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా రాణించింది. ఆమె బ్యాటింగ్లో 58 పరుగులతో పాటు బౌలింగ్లో కేవలం 39 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ వేసిన బంతికి నదీన్ డి క్లెర్క్ను కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అద్భుతమైన క్యాచ్తో ఔట్ చేసి విజయాన్ని ఖాయం చేసింది. ఈ చివరి వికెట్ పడగానే యావత్ భారత జట్టు సంబరాల్లో మునిగిపోయింది.
Team India: వరల్డ్ కప్ సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు.. జగన్, పవన్ అభినందనలు
Rohit Sharma literally crying after team India won the World Cup.😭🥹❤️#INDWvsSAW pic.twitter.com/whM3tizQen
— 𝗙e𝐚𝐫𝗹𝐞𝐬𝐬⁴⁵ (@45FearlessRo) November 2, 2025
టీమ్ ఇండియా ప్రపంచ ఛాంపియన్గా మారిన వెంటనే కెమెరాలు వీఐపీ బాక్స్ వైపు మళ్లగా, అక్కడ తన భార్యతో కలిసి మ్యాచ్ చూస్తున్న రోహిత్ శర్మ కళ్లలో ఆనంద భాష్పాలు కనిపించాయి. 2023 పురుషుల ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం దేశాన్ని కదిలించగా, ఇప్పుడు మహిళల విజయం చూసి ఆయన మళ్లీ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విజయంపై మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ ఐసీసీ ఛానల్తో మాట్లాడుతూ.. “గత 15 ఏళ్లుగా మేము ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం. మహిళా జట్టు ఈసారి ఆ సరిహద్దు దాటుతుందని ఆశిస్తున్నా” అని ఆశించారు. రోహిత్ అన్నట్టుగానే ఆ మాటలు నిజమయ్యాయి. ఈ చారిత్రాత్మక విజయాన్ని చూసేందుకు స్టేడియంలో సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సునీల్ గవాస్కర్, జై షా, నీతా అంబానీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని విరాట్ కోహ్లీ కూడా సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. వీరితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా సోషల్ మీడియా ద్వారా టీమిండియాకు అభినందనలు తెలిపారు.
A spectacular win by the Indian team in the ICC Women’s Cricket World Cup 2025 Finals. Their performance in the final was marked by great skill and confidence. The team showed exceptional teamwork and tenacity throughout the tournament. Congratulations to our players. This…
— Narendra Modi (@narendramodi) November 2, 2025
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!