T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఇటీవల తన ‘ఆల్ టైమ్ ఇండియా టి20 ఎలెవన్’ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి దిగ్గజాలతో పాటు కొందరు యువ ఆటగాళ్లకు కూడా చోటు కల్పించారు.
ఉతప్ప తన జట్టులో ఓపెనర్లుగా విధ్వంసకర బ్యాటర్ రోహిత్ శర్మ, యువ సంచలనం అభిషేక్ శర్మలను ఎంపిక చేశారు. మూడో స్థానంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీని, నాలుగో స్థానంలో సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ను బరిలోకి దించారు. ఐదో స్థానంలో ఫినిషర్, వికెట్ కీపర్ బ్యాటర్గా ఎమ్మెస్ ధోనీని ఎంపిక చేయగా.. ఆరో స్థానంలో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాకు చోటు దక్కింది.
Also Read
- India Test Cricket History: 94 ఏళ్ల టెస్ట్ ప్రయాణం.. 600వ మ్యాచ్కు చేరుకున్న టీమిండియా చరిత్ర ఇదే..!
- Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్మ్యాన్కు మరో అవకాశం
- Team India: బ్రిటీషర్ల గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. లండన్లో జెండా ఎగరేసిన విరాట్ కోహ్లీ.. గుర్తుందా?
- Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన 'నెయ్యి'ని తయారు చేయండి ఇలా..!
జట్టులో సమతుల్యత కోసం ఏడో స్థానంలో హార్దిక్ పాండ్యా, ఎనిమిదో స్థానంలో అక్షర్ పటేల్ రూపంలో ఇద్దరు నాణ్యమైన ఆల్రౌండర్లను ఉతప్ప తీసుకున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్ వైపు ఆయన మొగ్గు చూపారు. పేస్ విభాగంలో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఎడమచేతి వాటం పేసర్ అర్ష్దీప్ సింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు.
రాబిన్ ఉతప్ప ఆల్ టైమ్ టి20 ఎలెవన్..
రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
ఉతప్ప ఎంపిక చేసిన ఈ జట్టుపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ప్రస్తుత టి20 టాప్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ను నాలుగో స్థానంలో తీసుకోకపోవడం కొందరిని ఆశ్చర్యపరిచినా, యువరాజ్ సింగ్ సాధించిన ఘనతల దృష్ట్యా ఆ నిర్ణయం సరైనదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే తిలక్ వర్మ, సంజూ శాంసన్ వంటి యువ ఆటగాళ్లకు ఇందులో చోటు దక్కలేదు.
మొత్తంగా చూస్తే.. ఈ జట్టు ఎంతో బలంగా ఉంది. రైనా, యువరాజ్ వంటి పార్ట్-టైమ్ బౌలర్లు ఉండటం జట్టుకు అదనపు బలం. బుమ్రా, అర్ష్దీప్ సింగ్ వంటి పేసర్లు ఎలాంటి బ్యాటింగ్ లైనప్నైనా కట్టడి చేయగలరు. ఉతప్ప ఎంపిక చేసిన ఈ జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ పరంగా అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
India Test Cricket History: 94 ఏళ్ల టెస్ట్ ప్రయాణం.. 600వ మ్యాచ్కు చేరుకున్న టీమిండియా చరిత్ర ఇదే..!
-
Mahindra BE 6 SPORTEQ: మహీంద్రా BE6 స్పోర్టెక్ ఎలక్ట్రిక్ SUV విడుదల.. 683KM రేంజ్, Gemini AIతో అదిరిపోయే ఫీచర్లు
-
Saira Banu First Look: ముస్లిం అమ్మాయిని ప్రేమించే యువకుడిగా ఆది.. ఆకట్టుకుంటున్న ‘సైరాబాను’ ఫస్ట్ లుక్..
-
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్మ్యాన్కు మరో అవకాశం
-
Team India: బ్రిటీషర్ల గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. లండన్లో జెండా ఎగరేసిన విరాట్ కోహ్లీ.. గుర్తుందా?
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!