Road Accident: దారుణం.. ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి!
- ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో గురువారం అర్థరాత్రి ట్రక్కు - ట్రాక్టర్ ఢీ.
- ప్రమాదంలో 10 మంది కూలీలు మృతి.
- ముగ్గురికి గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో గురువారం అర్థరాత్రి ట్రక్కు, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో 10 మంది కూలీలు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద వార్త అందిన వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అనంతరం సహాయ, సహాయక చర్యలు ప్రారంభించారు.
Rashmika Mandanna: మరీ అంత క్యూట్ గా చుడొదబ్బా.. కుర్రాళ్లకు హార్ట్ హార్ట్ ఎటాక్ వస్తే ఎలా!
Also Read
- Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
మిర్జాపూర్ – వారణాసి సరిహద్దులోని కచ్వాన్, మీర్జామురాద్ మధ్య జిటి రోడ్డులో తెల్లవారుజామున 1 గంటలకు ప్రమాదం జరిగిందని మిర్జాపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పి) అభినందన్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.., భదోహి జిల్లాలో నిర్మాణ పనులు చేసి తిరిగి వస్తున్న ట్రాక్టర్ ట్రాలీలో 13 మంది కార్మికులు ఉన్నారు. వారి వాహనాన్ని వెనుక నుండి ట్రక్కు ఢీకొట్టింది. దాని కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీలో ప్రయాణిస్తున్న 13 మందిలో 10 మంది మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ట్రామా సెంటర్, వారణాసికి పంపారు. అక్కడ వారి పరిస్థితి సాధారణంగా ఉందని సమాచారం. ప్రమాదం తర్వాత ట్రక్కు బాగా దెబ్బతిన్నదని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) ఓపీ సింగ్ తెలిపారు. ఇటాహ్ జిల్లా నుంచి వస్తున్న ట్రక్కులో గాజు షీట్లు లోడ్ చేశారు. ఘటన తర్వాత లారీ డ్రైవర్, సహాయకులు అక్కడి నుంచి పరారయ్యారు.
Devara : ఏపీ – తెలంగాణ మొదటి వారం కలెక్షన్స్.. NTR ఊచకోత..!
మృతులను భాను ప్రతాప్ (25), వికాస్ కుమార్ (20), అనిల్ కుమార్ (35), సూరజ్ కుమార్ (22), సనోహర్ (25), రాకేష్ కుమార్ (25), ప్రేమ్ కుమార్ (40), రాహుల్ కుమార్, అలియాస్ టిల్లు (26), నితిన్ కుమార్ (22), రోషన్ కుమార్ (17) లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆకాష్ కుమార్, జముని, అజయ్ సరోజ్ గాయపడ్డారు. వీరంతా వారణాసి జిల్లా వాసులు.
తాజావార్తలు
-
Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
-
Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!