Sambhal Violence: ముస్లింలను రెచ్చగొట్టిన “సమాజ్వాదీ” ఎంపీ.. సంభాల్ హింసపై ఎఫ్ఐఆర్..
- సంభాల్ హింసలో సమాజ్వాదీ ఎంపీ పాత్ర..
- స్థానిక గుంపుని రెచ్చగొట్టి దాడికి పాల్పడేలా చేశాడని ఎఫ్ఐఆర్..
- ఎంపీ జియా ఉర్ రెహ్మాన్పై కేసు నమోదు..
- మసీదు సర్వే సమయంలో అధికారులపై రాళ్ల దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ నగరంలో అట్టుడుకుతోంది. షాహీ జామా మసీదు వివాదం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసింది. కోర్టు ఆదేశాలతో ఈ మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులు, పోలీసులపై అక్కడి స్థానికులు రాళ్ల దాడి చేశారు. పోలీసులు టియర్ గ్యాస్, కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ హింసాత్మక ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించగా, 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. పదుల సంఖ్యలో వాహనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి.
అయితే, ఈ హింసాత్మక ఘటనల్లో స్థానిక సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ పాత్ర ఉన్నట్లుగా ఎఫ్ఐఆర్ నమోదైంది. చారిత్రక హరిహర్ ఆలయాన్ని మొఘల్ పాలకుడు బాబర్ కూల్చివేసి ఈ మసీదును నిర్మించారని, హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ సర్వేకి కోర్టు ఆదేశమిచ్చింది. సర్వే చేస్తున్న క్రమంలో ఆదివారం రోజు పెద్ద ఎత్తున స్థానిక గుంపు మూడు వైపుల నుంచి అధికారులపై రాళ్ల దాడికి పాల్పడింది. ఈ మొత్తం కుట్రలో ఎంపీ రెహ్మాన్తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో 700-800 మంది గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు.
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
Read Also: Minister Seethakka : మహిళలను లక్షాధికారులు చేసేందుకు ప్లాన్.. 19 రకాల వ్యాపారాల గుర్తింపు
హింస జరగడానికి రెండు గంటల ముందు రెహ్మాన్ నమాజ్ కోసం మసీదుకు వెళ్లి రెచ్చగొట్టే ప్రకటనలు చేశాడని ఎఫ్ఐఆర్ పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసం జనాలను రెచ్చగొట్టి మత సామరస్యాన్ని దెబ్బ తీసినట్లు కేసు నమోదైంది. సంఘటన జరిగిన రోజు, సోహైల్ ఇక్బాల్, ఇతరులు గుంపును రెచ్చగొట్టారు. ‘‘జియా ఉర్ రెహ్మాన్ మాతో ఉన్నాడు, మేము మీతో ఉన్నాము, మేము మిమ్మల్ని రక్షిస్తాము. మీ లక్ష్యాన్ని పూర్తి చేయండి’’ అంటూ సోహైల్ గుంపుని రెచ్చగొట్టినట్లు తేలింది.
సర్వేలో అడ్డంకులు సృష్టించవద్దని అడ్మినిస్ట్రేటివ్ అధికారులు , పోలీసు పార్టీ గుంపును కోరిందని, అయితే గుమిగూడిన ప్రజలు నినాదాలు చేశారు, రాళ్లు రువ్వారు , పోలీసు వాహనాలు, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని ఎఫ్ఐఆర్ పేర్కొంది. అనేక దుకాణాలకు నిప్పు పెట్టారు. గుర్తు తెలియని షూటర్ హత్య చేయాలనే ఉద్దేశ్యంతో సర్కిల్ ఆఫీసర్ అనుజ్ కుమార్ చౌదరిపై కాల్పులు జరిపాడు. అధికారి కుడి కాలికి బుల్లెట్ గాయమైంది. నేరస్తులను గుర్తించేందుకు డ్రోన్ ఫుటేజీలు, సీసీటీవీ కెమెరాలను ఉపయోగిస్తున్నామని, కఠినమైన జాతీయ భద్రతా చట్టం కూడా ప్రయోగించవచ్చని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!