Sambhal Violence: ముస్లింలను రెచ్చగొట్టిన “సమాజ్వాదీ” ఎంపీ.. సంభాల్ హింసపై ఎఫ్ఐఆర్..
- సంభాల్ హింసలో సమాజ్వాదీ ఎంపీ పాత్ర..
- స్థానిక గుంపుని రెచ్చగొట్టి దాడికి పాల్పడేలా చేశాడని ఎఫ్ఐఆర్..
- ఎంపీ జియా ఉర్ రెహ్మాన్పై కేసు నమోదు..
- మసీదు సర్వే సమయంలో అధికారులపై రాళ్ల దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ నగరంలో అట్టుడుకుతోంది. షాహీ జామా మసీదు వివాదం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసింది. కోర్టు ఆదేశాలతో ఈ మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులు, పోలీసులపై అక్కడి స్థానికులు రాళ్ల దాడి చేశారు. పోలీసులు టియర్ గ్యాస్, కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ హింసాత్మక ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించగా, 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. పదుల సంఖ్యలో వాహనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి.
అయితే, ఈ హింసాత్మక ఘటనల్లో స్థానిక సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ పాత్ర ఉన్నట్లుగా ఎఫ్ఐఆర్ నమోదైంది. చారిత్రక హరిహర్ ఆలయాన్ని మొఘల్ పాలకుడు బాబర్ కూల్చివేసి ఈ మసీదును నిర్మించారని, హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ సర్వేకి కోర్టు ఆదేశమిచ్చింది. సర్వే చేస్తున్న క్రమంలో ఆదివారం రోజు పెద్ద ఎత్తున స్థానిక గుంపు మూడు వైపుల నుంచి అధికారులపై రాళ్ల దాడికి పాల్పడింది. ఈ మొత్తం కుట్రలో ఎంపీ రెహ్మాన్తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో 700-800 మంది గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
Read Also: Minister Seethakka : మహిళలను లక్షాధికారులు చేసేందుకు ప్లాన్.. 19 రకాల వ్యాపారాల గుర్తింపు
హింస జరగడానికి రెండు గంటల ముందు రెహ్మాన్ నమాజ్ కోసం మసీదుకు వెళ్లి రెచ్చగొట్టే ప్రకటనలు చేశాడని ఎఫ్ఐఆర్ పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసం జనాలను రెచ్చగొట్టి మత సామరస్యాన్ని దెబ్బ తీసినట్లు కేసు నమోదైంది. సంఘటన జరిగిన రోజు, సోహైల్ ఇక్బాల్, ఇతరులు గుంపును రెచ్చగొట్టారు. ‘‘జియా ఉర్ రెహ్మాన్ మాతో ఉన్నాడు, మేము మీతో ఉన్నాము, మేము మిమ్మల్ని రక్షిస్తాము. మీ లక్ష్యాన్ని పూర్తి చేయండి’’ అంటూ సోహైల్ గుంపుని రెచ్చగొట్టినట్లు తేలింది.
సర్వేలో అడ్డంకులు సృష్టించవద్దని అడ్మినిస్ట్రేటివ్ అధికారులు , పోలీసు పార్టీ గుంపును కోరిందని, అయితే గుమిగూడిన ప్రజలు నినాదాలు చేశారు, రాళ్లు రువ్వారు , పోలీసు వాహనాలు, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని ఎఫ్ఐఆర్ పేర్కొంది. అనేక దుకాణాలకు నిప్పు పెట్టారు. గుర్తు తెలియని షూటర్ హత్య చేయాలనే ఉద్దేశ్యంతో సర్కిల్ ఆఫీసర్ అనుజ్ కుమార్ చౌదరిపై కాల్పులు జరిపాడు. అధికారి కుడి కాలికి బుల్లెట్ గాయమైంది. నేరస్తులను గుర్తించేందుకు డ్రోన్ ఫుటేజీలు, సీసీటీవీ కెమెరాలను ఉపయోగిస్తున్నామని, కఠినమైన జాతీయ భద్రతా చట్టం కూడా ప్రయోగించవచ్చని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
-
Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
-
Michael : బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’ రూ. 9500 కోట్ల వసూళ్లతో ఆల్టైమ్ రికార్డ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
ట్రెండింగ్
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!