Sambhal Violence: ముస్లింలను రెచ్చగొట్టిన “సమాజ్వాదీ” ఎంపీ.. సంభాల్ హింసపై ఎఫ్ఐఆర్..
- సంభాల్ హింసలో సమాజ్వాదీ ఎంపీ పాత్ర..
- స్థానిక గుంపుని రెచ్చగొట్టి దాడికి పాల్పడేలా చేశాడని ఎఫ్ఐఆర్..
- ఎంపీ జియా ఉర్ రెహ్మాన్పై కేసు నమోదు..
- మసీదు సర్వే సమయంలో అధికారులపై రాళ్ల దాడి..
Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ నగరంలో అట్టుడుకుతోంది. షాహీ జామా మసీదు వివాదం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసింది. కోర్టు ఆదేశాలతో ఈ మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులు, పోలీసులపై అక్కడి స్థానికులు రాళ్ల దాడి చేశారు. పోలీసులు టియర్ గ్యాస్, కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ హింసాత్మక ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించగా, 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. పదుల సంఖ్యలో వాహనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి.
అయితే, ఈ హింసాత్మక ఘటనల్లో స్థానిక సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ పాత్ర ఉన్నట్లుగా ఎఫ్ఐఆర్ నమోదైంది. చారిత్రక హరిహర్ ఆలయాన్ని మొఘల్ పాలకుడు బాబర్ కూల్చివేసి ఈ మసీదును నిర్మించారని, హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ సర్వేకి కోర్టు ఆదేశమిచ్చింది. సర్వే చేస్తున్న క్రమంలో ఆదివారం రోజు పెద్ద ఎత్తున స్థానిక గుంపు మూడు వైపుల నుంచి అధికారులపై రాళ్ల దాడికి పాల్పడింది. ఈ మొత్తం కుట్రలో ఎంపీ రెహ్మాన్తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో 700-800 మంది గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు.
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
Read Also: Minister Seethakka : మహిళలను లక్షాధికారులు చేసేందుకు ప్లాన్.. 19 రకాల వ్యాపారాల గుర్తింపు
హింస జరగడానికి రెండు గంటల ముందు రెహ్మాన్ నమాజ్ కోసం మసీదుకు వెళ్లి రెచ్చగొట్టే ప్రకటనలు చేశాడని ఎఫ్ఐఆర్ పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసం జనాలను రెచ్చగొట్టి మత సామరస్యాన్ని దెబ్బ తీసినట్లు కేసు నమోదైంది. సంఘటన జరిగిన రోజు, సోహైల్ ఇక్బాల్, ఇతరులు గుంపును రెచ్చగొట్టారు. ‘‘జియా ఉర్ రెహ్మాన్ మాతో ఉన్నాడు, మేము మీతో ఉన్నాము, మేము మిమ్మల్ని రక్షిస్తాము. మీ లక్ష్యాన్ని పూర్తి చేయండి’’ అంటూ సోహైల్ గుంపుని రెచ్చగొట్టినట్లు తేలింది.
సర్వేలో అడ్డంకులు సృష్టించవద్దని అడ్మినిస్ట్రేటివ్ అధికారులు , పోలీసు పార్టీ గుంపును కోరిందని, అయితే గుమిగూడిన ప్రజలు నినాదాలు చేశారు, రాళ్లు రువ్వారు , పోలీసు వాహనాలు, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని ఎఫ్ఐఆర్ పేర్కొంది. అనేక దుకాణాలకు నిప్పు పెట్టారు. గుర్తు తెలియని షూటర్ హత్య చేయాలనే ఉద్దేశ్యంతో సర్కిల్ ఆఫీసర్ అనుజ్ కుమార్ చౌదరిపై కాల్పులు జరిపాడు. అధికారి కుడి కాలికి బుల్లెట్ గాయమైంది. నేరస్తులను గుర్తించేందుకు డ్రోన్ ఫుటేజీలు, సీసీటీవీ కెమెరాలను ఉపయోగిస్తున్నామని, కఠినమైన జాతీయ భద్రతా చట్టం కూడా ప్రయోగించవచ్చని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!