ఐపీఎల్ 17 వ సీజన్ ముగిసింది. ఈసారి విజేతగా కేకేఆర్ మూడోసారి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ టోర్నమెంట్ లో కేకేఆర్ తరుపున బాగా పర్ఫర్మ్ చేసిన వారిలో టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ ఒకడు. ఇకపోతే ప్రస్తుతం భారీ ఫామ్లో ఉన్న ఈ ఆటగాడిని అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న పొట్టి ప్రపంచకప్ కు ఏమికా చేయలేదు బీసీసీఐ సెలక్షన్ కమిటీ.
Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’లో దీపికా పాత్ర అలా ఉండబోతుందా..?
ఇక పొట్టి ప్రపంచకప్ జట్టులో ఎంపిక కాకపోవడంపై రింకూ సింగ్ మొదటి సారి స్పందించాడు. ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చెప్పాడనే విషయాన్ని తాజాగా వెల్లడించాడు. ఈ ఐసీసీ మెగా ఈవెంట్ లో చోటు దక్కకపోవడం తనకు ఎంతో బాధ కలిగించిందన్నాడు. మనం ఎంత బాగా ఆడిన టీంలో ఎంపిక అవ్వకపోతే మాములుగా ఎవరైనా బాధపడతారు.. ఈ విషయంలో సెలక్టర్ల తప్పేం లేదని తెలిపాడు. ముఖ్యంగా జట్టు కాంబినేషన్ కారణంగానే తనకి జట్టులో చోటు దక్కలేదని తెలిపాడు.
Gold Price Today మగువలకు భారీ షాక్.. వరుసగా రెండోరోజు పెరిగిన బంగారం ధరలు!
ఇదే విషయం పై మొదట్లో తాను చాలా బాధపడ్డానని తెలుపుతూ.. మన చేతిలో లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదని నిర్ణయించుకుంట్లు తెలిపాడు. జీవితంలో ఏం విషయం జరిగినా అంతా మన మంచికే అనుకున్నట్లుగా తెలిపాడు. ఇది ఇలా ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ తనకి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా సెలక్షన్స్ గురించి ఎక్కువగా ఆలోచించద్దని సూచిస్తూ.. నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపొద్దని., అందుకోసం పెద్దగా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పినట్లు తెలిపాడు.