Revanth Reddy: ప్రతిపక్షాలు హైడ్రాను అస్రంగా వాడుకుంటున్నాయి.. ప్రజలు పాలాభిషేకం చేస్తున్నారు!
- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
- ప్రతిపక్షాలు హైడ్రాను అస్రంగా వాడుకుంటున్నాయి
- హైడ్రాకు ప్రజలు పాలాభిషేకం చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్రంగా వాడుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుసినప్పుడు గతంలో పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి భేరీజు వేడుకోండన్నారు. ఎంత భారీ వర్షం పడినా గంటా, రెండు గంటల వ్యవధిలోనే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి.. వరద నీటిని మళ్లించడంలో హైడ్రా బాగా పని చేస్తోందని ప్రశంసించారు. అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకోవడం, చెరువుల పునరుద్ధరణలో హైడ్రా సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్ గుర్తిస్తోందని, హైడ్రాను బూచిగా చూపి రాజకీయ లబ్ది పొందాలనుకోవడం దుర్మార్గం అని విమర్శించారు. పేదలు మురికి కూపంలో జీవితాలు వెల్లదీయాలని సంకుచితంగా ఆలోచించే వాళ్లే హైడ్రాను వ్యతిరేకిస్తూ దానిని ఒక బూచిగా చూపిస్తూ పేదల్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.
Also Read: Virender Sehwag: ధోనీ నన్ను జట్టు నుంచి తొలగించాడు.. నేరుగా సచిన్ దగ్గరికి వెళ్లా..!
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
- Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ‘కృష్ణా గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోము. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే.. శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుంది. ఇప్పటి వరకు హైడ్రా 13 పార్కులు, 20 సరస్సులను ఆక్రమణల నుంచి రక్షించింది. అంబర్ పేట బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. 30 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడింది. ఈరోజు సామాన్య ప్రజలు హైడ్రాకు పాలాభిషేకం చేస్తున్నారు. మేం అధికారం చేపట్టే నాటికి వారసత్వంగా 8 లక్షల 21 వేల 651 కోట్ల అప్పులు, బకాయిలుగా మిగిల్చి వెళ్లారు. దీనిలో 6 లక్షల 71 వేల 757 కోట్ల అప్పులు.. ఉద్యోగుల, ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు 40 వేల 154 కోట్లు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సింగరేణి, విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు లక్షా 9 వేల 740 కోట్లు. గత పాలకులు చేసిన అప్పును సర్వీస్ చేయడానికి ఇప్పటి దాకా అసలు రూపేణా లక్షా 32 వేల 498 కోట్లు, వడ్డీలకు 88 వేల 178 కోట్లు అలిసి మొత్తం 2 లక్షల 20 వేల 676 కోట్ల డేట్ సర్వీసింగ్ చేశాం’ అని సీఎం చెప్పారు.
తాజావార్తలు
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!