Revanth Reddy: కింగ్ అవ్వుడు సంగతి పక్కనపెట్టు.. ముందు డిపాజిట్ తెచ్చుకో కిషన్ రెడ్డి!
- జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
- యూసఫ్గూడ చెక్పోస్ట్ వద్ద సీఎం కార్నర్ మీటింగ్
- సినిమా కార్మికుల సమస్యలపై కేటీఆర్ ఏనాడూ ఆలోచించలేదు
- ముందు డిపాజిట్ తెచ్చుకో కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కింగ్ అవ్వుడు సంగతి పక్కనపెట్టు.. ముందు డిపాజిట్ తెచ్చుకో’ అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, కేటీఆర్ వేరు కాదని.. ఇద్దరు నాణెంకు ఉండే బొమ్మ బొరుసు లాంటి వాళ్లే అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు సీబీఐకి ఇవ్వు అని చెప్పిన కిషన్ రెడ్డి.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కిషన్ రెడ్డి.. నీకు ఎవడు భయపడడు అని సీఎం రేవంత్ అన్నారు. జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. యూసఫ్గూడ చెక్పోస్ట్ వద్ద కార్నర్ మీటింగ్లో ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మీటింగ్లో పాల్గొన్నారు. జనం భారీగా తరలి వచ్చారు.
Also Read: Peddi vs Ustaad Bhagat Singh: ‘బాబాయ్-అబ్బాయ్’ బ్యాక్ టు బ్యాక్.. మెగా అభిమానులకు పండగే!
Also Read
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
‘నక్క జిత్తులతో కొన్ని నక్కలు మీ దగ్గరికి వస్తున్నాయి. పదేళ్లు రాని వాళ్లు ఇప్పుడు వస్తున్నారు. సినిమా కార్మికుల సమస్యలపై కేటీఆర్ ఏనాడూ ఆలోచించలేదు. కేటీఆర్ సినిమా హీరోల గెస్ట్హౌస్లు తిరిగాడు కానీ సినీ కార్మికులను కలిసిన పాపాన పోలేదు. కిషన్ రెడ్డి, కేటీఆర్ వేరు కాదు.. బొమ్మ బొరుసు లాంటి వాళ్ళే. కాళేశ్వరం మీద సీబీఐకి ఇవ్వు.. లోపల వేస్తాం అన్నాడు కిషన్ రెడ్డి. అర్థరాత్రి వరకూ అసెంబ్లీ నడిపించి.. సీబీఐ విచారణకి ఇచ్చాం. కానీ ఇప్పటికీ విచారణ లేదు. కిషన్ రెడ్డి నా ఇంటికి వస్తా అంటున్నాడు. నా ఇంటికి ఎందుకు, మోడీ ఇంటికి పో. మీ దగ్గరే కదా సీబీఐ ఉంది. కిషన్ రెడ్డి.. నీకు ఎవడు భయపడడు. కేసీఆర్ లాంటి వారినే ఫామ్ హౌస్కి పరిమితం అయ్యేలా చేశారు మా కార్యకర్తలు. కిషన్ రెడ్డి నేను కింగ్ ఐత అంటున్నాడు. కింగ్ అవ్వుడు సంగతి పక్కన పెట్టు.. ముందు డిపాజిట్ తెచ్చుకో కిషన్ రెడ్డి’ అని సీఎం విమర్శించారు.
తాజావార్తలు
-
Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
-
Kitchen Tips: బియ్యంలో పురుగుల నుంచి బిర్యానీ రైస్ వరకు.. వంటగది రూపురేఖలు మార్చే అమేజింగ్ చిట్కాలు!
-
Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
-
Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
-
Vastu Tips: ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంటే ధన నష్టం తప్పదు.. వాస్తు ఏం చెబుతోంది..?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!