Revanth Reddy : ఈ పాలకులు ప్రజాస్వామ్య వాదులను భయపెట్టాలని చూస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రొఫెసర్ హరగోపాల్ తో పాటు మరో 152 మందిపైన తాడ్వాయి పోలీస్ స్టేషన్లలో ఉపా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ పాలకులు ప్రజాస్వామ్య వాదులను భయపెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప మేధావని, ఆయన పౌర హక్కుల కోసం అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడి ప్రజా హక్కులను కాపాడిన మానవతా వాది అని ఆయన కొనియాడారు. సెంట్రల్ యూనివర్సిటీలలో పౌర హక్కుల కోసం పాఠాలు బోధించిన ప్రొఫెసర్ అని, తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పని చేసిన ఉద్యమ కారుడన్నారు. నక్సలైట్ ఎజెండా నే మా ఎజెండా అని ప్రకటించిన కేసీఆర్, హరగోపాల్ నక్సలైట్లకు సహకరిస్తూ దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని కేసులు పెట్టడం ఒక అప్రజాస్వామిక చర్య అన్నారు. ఒకవేళ ప్రభుత్వ దృష్టిలో హరగోపాల్ దోషి అయితే నక్సలైట్ల ఏజండా నే మా ఏజండా అన్న కేసీఆర్ కూడా దోషినే కదా అని ఆయన అన్నారు.
Also Read : Adipurush : ప్రభాస్ యాక్టింగ్, హనుమంతుడి స్క్రీన్ ప్రెజన్స్.. సినిమాలోని హైలెట్స్ ఇవే ..
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
అంతేకాకుండా.. ‘నక్సలైట్ల ఎజెండానే మా ఏజండా అని ప్రకటించిన కేసీఆర్ పైన కూడా కేసులు పెడతారా.. హరగోపాల్ తో పాటు 152 మంది పైన కేసులు ఎత్తేయాలి. తెలంగాణ పౌర, ప్రజాస్వామిక సంఘాలు రాజకీయ పక్షాలు హరగోపాల్ కు అండగా ఉండాలి.. హరగోపాల్ తో పాటు 152 మంది పైన ఉపా కేసులు ఎత్తేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ప్రజాస్వామిక పౌర సంఘాలు బీజేపీ, బీఆర్ఎస్ లకు వ్యతిరేకంగా ప్రజల కోసం పై చేస్తుండడంతో ప్రభుత్వాలు ఇలా పాశవికంగా ప్రవర్తిస్తున్నాయి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హరగోపాల్ తోపాటు 152 మంది పైన ఉపా కేసులు ఎత్తేస్తామన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : Salaar: సలార్ లో రాఖీ భాయ్.. కథ తెలిసిపోయింది..?
తాజావార్తలు
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!