CM Revanth Reddy: భద్రాచలం శ్రీ సీతారాములను సీఎం రేవంత్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల జయజయధ్వానాల నడుమ అభిజిత్ లగ్నంలో కళ్యాణ క్రతువును వేదపండితులు పూర్తిచేశారు. అత్యధిక సంఖ్యలో హాజరైన భక్తులు కళ్యాణాన్ని తిలకించారు. ఈ వేడుక కన్నుల పండువగా సాగింది. భద్రాచలం పుర వీధులన్నీ శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి. ఇక, రాములోరి కళ్యాణానికి తరలివచ్చిన అశేష భక్త జనానికి ఇబ్బందులు లేకుండా ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం ముత్యాల తలంబ్రాలు, లడ్డు ప్రసాదాలు పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తజనానికి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాద్రి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ శాఖ చేసింది.
READ MORE: Amaravati Fire Incident: అమరావతిలో వరుస అగ్నిప్రమాదాల కేసులో కీలక పురోగతి..