భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రాల్లో బాలీవుడ్ ‘రామాయణం’ ఒకటి. భారతీయ పురాణ ఇతిహాసం ‘రామాయణాన్ని’ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించేందుకు బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ సిద్ధమయ్యారు. సుమారు రూ. 4,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో (రెండు భాగాలకు కలిపి) రూపొందుతున్న ఈ చిత్రం, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్గా నిలవనుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడిగా…