Revanth Reddy : రాబోయే మూడు రోజులు.. రాహుల్ పాదయాత్ర అత్యంత కీలకం
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట దేశ వ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. పాదయాత్ర రాహుల్ గాంధీ ఉత్సాహంతో పాల్గొనడమే కాకుండా.. పాదయాత్రలో ఉన్నవారితో రన్నింగ్లు, వ్యాయమాలు సైతం చేయిస్తున్నారు. అయితే.. తాజాగా.. ఈ నేపథ్యంలో.. కామారెడ్డి – నిజాంసాగర్ లో భారత్ జోడో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ పాదయాత్రపై ప్రజల్లో చర్చ లేకుండా చేసేందుకు.. టీఆర్ఎస్-బీజేపీల ఫాం హౌజ్ డ్రామా ఆడుతున్నాయంటూ విమర్శలు గుప్పించారు.
Also Read :T20 World Cup: సెమీస్కు వెళ్లిన తొలి జట్టుగా న్యూజిలాండ్
ప్రతిపక్ష పార్టీలు ఎన్ని డ్రామాలాడిన రాహుల్ పాదయాత్రకు ప్రజల్లో విశేష స్పందన ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే మూడు రోజులు.. రాహుల్ పాదయాత్ర అత్యంత కీలకమన్నా రేవంత్ రెడ్డి.. కర్ణాటక తరహాలో తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే.. మద్నూర్ మండలం మేనూరు లో భారత్ జోడో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. రాహుల్ పాదయాత్రలో ఇప్పటి వరకు పాల్గొనని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులు అసెంబ్లీ నియోజకవర్గాల శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ జర్నలిస్టుల సమస్యలపై రాహుల్ గాంధీ మాట్లాడుతారని, కార్తీక పౌర్ణమి రాత్రి సమయంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారని ఆయన వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మీదుగా మహారాష్ట్రకు భారత్ జోడో యాత్ర ప్రవేశించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!