Revanth Reddy : బీఆర్ఎస్ అంటే బీహార్ రాష్ట్ర సమితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికతో ఆ పార్టీలో రాజకీయం వేడెక్కింది. అయితే.. ఈ సారి గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో ఉండరని ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే.. గాంధీ కుటుంబం మాత్రం అధ్యక్ష ఎన్నికల్లో నిలబడిన వారిలో ఒకరికి మాత్రమే మద్దుతుగా ఉంది. ప్రస్తుతం పోటీలో మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్లు ఉండగా.. మల్లికార్జున్ ఖర్గేకు గాంధీ కుటుంబం మద్దతుగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. శశిథరూర్ నాకు నిన్న సాయంత్రం కాల్ చేశారని, ఆయన ఫిక్కీ ప్రోగ్రాంకి వచ్చారని తెలిపారు. ఉదయం కాఫీకి రావాలని పిలిచామని, మా దగ్గర బంధువు చనిపోవడం వల్ల అక్కడికి వెళ్లడం వల్ల కలవలేకపోయామన్నారు.
Also Read
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
ఢిల్లీలో కలుస్త అని చెప్పానని, ఆయన ప్రైవేటు ప్రోగ్రాంకి వచ్చారని ఆయన వెల్లడించారు. బరిలో ఇద్దరు ఉన్నారు నామినేషన్ల ఉప సంహరణ 8 వరకు ఉందని, తరువాత పార్టీ డిసిషన్ తీసుకుంటుందన్నారు. ఇది ఫ్రెండ్లీ కంటెస్టు మాత్రమేనని, మల్లికార్జున్ ఖర్గే తెలంగాణ బిడ్డ అని, తెలంగాణ బిడ్డకు ఏఐసీసీ అధ్యక్షుడుగా అవకాశం వచ్చినప్పుడు కొంతమంది ఆయన్ను గెలిపించాలని చెప్పుంటారన్నారు. ఆయన అవకాశం ఇవ్వాలని కోరడం పాజిటివ్ కోణంలోనే చూడాలని, నా భావన కూడా అదే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేను పీసిసి గా ఉన్న కాబట్టి న్యూట్రల్ గా ఉండాలని,
రాహుల్ గాంధీ పాదయాత్ర సమయంలో నాకు ఈడీ నోటీసులు వచ్చిన భయపడనని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
-
Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత
-
BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!
-
AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు
-
Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!