RCB: కోహ్లిని రిటైన్ చేసి ఆటగాళ్లందరినీ విడుదల చేయండి.. ఆర్సీబీకి మాజీ క్రికెటర్ సలహా
- కోహ్లిని రిటైన్ చేసి ఆటగాళ్లందరినీ విడుదల చేయండి..
- ఆర్సీబీకి మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ సలహా
- కోహ్లీని ఉంచుకుని మిగతా అందరినీ విడుదల చేసి ఆర్టీఎంని ఉపయోగించాలి- ఆర్పీ సింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త రిటెన్షన్ నిబంధనను రూపొందించింది. అక్టోబర్ 31 లోపు అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ చేయబడిన ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని కోరింది. ఐపీఎల్ 2025 కోసం బీసీసీఐ అనేక కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ క్రమంలో.. ఈసారి మెగా వేలం చాలా ఆసక్తికరంగా ఉండనుంది. తదుపరి సీజన్ కోసం మెగా వేలానికి ముందు.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఆర్సీబీకి సలహా ఇచ్చాడు. ఆర్సీబీ విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకుని.. మిగిలిన వారిని విడుదల చేయమని చెప్పాడు.
ఐపీఎల్ కొత్త రిటెన్షన్ నియమాల ప్రకారం.. ప్రతి జట్టుకు 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేయడానికి లేదా ఆర్టీఎం ఉపయోగించి ఆటగాళ్లను తిరిగి తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఐపీఎల్ 2024లో కోహ్లి ఆర్సీబీకి స్టార్ ప్లేయర్గా నిరూపించుకున్నాడు. జట్టును ప్లేఆఫ్స్కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా.. అద్భుత బ్యాటింగ్తో కోహ్లీ ఆరెంజ్ క్యాప్ను కూడా గెలుచుకున్నాడు. 15 మ్యాచ్ల్లో 741 పరుగులు చేశాడు. కలర్స్ సినీప్లెక్స్తో ఆర్పీ సింగ్ మాట్లాడుతూ, కోహ్లీ జట్టుతోనే ఉండాలని.. మహ్మద్ సిరాజ్, రజత్ పాటిదార్ వంటి ఇతర ఆటగాళ్లను ఆర్టిఎమ్ కార్డ్ ఉపయోగించి వేలంలో తిరిగి తీసుకురావచ్చని ఆర్పీ సింగ్ తెలిపారు.
Also Read
- India Unwanted Record: ఇంగ్లండ్ ధాటికి చిత్తైన భారత్.. చరిత్రలో తొలిసారి చెత్త రికార్డు
- 14 నిమిషాల్లో 3 గోల్స్.. మాయ చేసిన Argentina.! ఓటమి అంచుల నుంచి క్వార్టర్స్ బరిలోకి ఛాంపియన్స్.!
- Shreyas Iyer: మా ఆట దారుణంగా ఉంది.. మేం చెత్తగా ఆడాం.!
- Ayodhya Ram Mandir: రామ మందిర్ ట్రస్ట్లో కలకలం.. చంపత్ రాయ్ వ్యాఖ్యలతో మళ్లీ వేడెక్కిన వివాదం
వేలంలో సిరాజ్, రజత్ పటిదర్ రూ.11 కోట్లకు మించి పొందలేరని మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇందులో ఆర్సీబీకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని భావిస్తున్నాను అని చెప్పాడు. ఆర్సీబీ కోహ్లీని మాత్రమే ఉంచుకుని మిగతా అందరినీ విడుదల చేసి ఆర్టీఎంని ఉపయోగించాలని కోరాడు. రజత్ పాటిదార్ను వదిలేస్తే వేలంలో తక్కువ ధరకు పొందగలమని తాను భావిస్తున్నానని అన్నాడు. కాబట్టి వారిని వేలంలో తిరిగి కొనుగోలు చేయవచ్చని ఆర్పీ సింగ్ తెలిపాడు.
సిరాజ్ వేలంలో రూ.11 కోట్లకు చేరువగా వస్తాడా లేదా అన్నది చూడాలి అని ఆర్సీబీ సింగ్ అన్నాడు. సిరాజ్ 14 కోట్ల రూపాయలకు చేరుకోవడం కష్టమే.. కావున ఆర్సీబీ ఆర్టీఎంని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పాడు. ఇక ఆర్సీబీ కొత్త మనస్తత్వంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్సీబీకి విరాట్ కోహ్లీ అవసరం.. ఎందుకంటే అతను జట్టు కోసం చాలా చేశాడు. విరాట్ చాలా ముఖ్యమైన ఆటగాడు. కోహ్లీ చుట్టూ జట్టును నిర్మించడం గురించి ఆర్సీబీ ఆలోచించాలని పేర్కొన్నాడు. ఆర్సీబీలో కోహ్లి తప్పా.. మరే ఇతర ఆటగాడు రూ.18 లేదా రూ.14 కోట్లుగా కనిపించడం లేదని చెప్పాడు.
Udhayanidhi Stalin: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్..మంత్రి వర్గంలో మరో నలుగురికి చోటు
- Tags
- all players
- Kohli
- RCB
- release
- Retain
తాజావార్తలు
-
Beware Bachelors: పెళ్లి కావాల్సిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన వార్త! అందాల ఎర వేసి కోట్లు కాజేసిన కేటుగాళ్లు..
-
India Unwanted Record: ఇంగ్లండ్ ధాటికి చిత్తైన భారత్.. చరిత్రలో తొలిసారి చెత్త రికార్డు
-
Sing Geetham OTT Release : ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసిన ‘సింగ్ గీతం’
-
14 నిమిషాల్లో 3 గోల్స్.. మాయ చేసిన Argentina.! ఓటమి అంచుల నుంచి క్వార్టర్స్ బరిలోకి ఛాంపియన్స్.!
-
Redmi Turbo 6 Max: రెడ్మీ టర్బో 6 మ్యాక్స్.. 10000mAh బ్యాటరీ, 7-ఇంచెస్ 2K డిస్ప్లేతో వచ్చేస్తోంది!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!