కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ వ్యవసాయం రంగంలో సమూల మార్పులకు నాంది పలుకుతూ… కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలను కేంద్రం ప్రతిపాదించినప్పటి నుంచి… బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అటు ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ చట్టాలను వ్యతిరేకించాయి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది తమిళనాడు సర్కార్. శాసన సభలో మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సిఎం స్టాలిన్. చట్టాలు రైతుల హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్న సీఎం స్టాలిన్… వ్యవసాయ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. అయితే… తీర్మానం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ… అసెంబ్లీ వాకౌట్ చేసి ధర్నాకు దిగారు బిజెపి పార్టీ ఎమ్మెల్యేలు.