Church Vandalised : చర్చిని ధ్వంసం చేసిన దుండగులు.. కర్ణాటకలో ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Church Vandalised : కర్ణాటకలోని మైసూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ చర్చిని మంగళవారం కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు. బాల ఏసుక్రీస్తు విగ్రహాన్ని ముక్కలు చేశారు. క్రిస్మస్ వేడుకలు ముగిసిన రెండ్రోజుల తర్వాత ఈ దాడి జరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మైసూరులోని పెరియపట్నంలో ఉన్న సెయింట్ మేరీస్ చర్చిలో ఇటీవల క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే మంగళవారం రాత్రి కొందరు గుర్తుతెలియని దుండుగులు ఈ చర్చిని, ఏసు విగ్రహాన్ని కూడా ధ్వసంచేసినట్లు పోలీసులు తెలిపారు. చర్చి వెనుక తలుపులు పగుల గొట్టి లోపలికి ప్రవేశించారని అన్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని వారు తెలిపారు.
Read Also: Nasal Vaccine: బూస్టర్ డోస్ తీసుకున్న వారు నాసల్ వ్యాక్సిన్ వేసుకోవద్దు
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
దుండగులు దొంగతనం కోసమా, కేవలం దాడి కోసమా వచ్చారన్నది విచారణలో తేలుస్తామని పోలీసులు చెప్పారు. చర్చి వెలుపల ఉంచిన ఒక విరాళాల పెట్టేతో పాటు డబ్బును ఎత్తుకెళ్లారని చెప్పారు. దొంగతనం కేసుగా భావిస్తున్నామని మైసూర్పోలీస్ సూపరింటెండెంట్ సీమా లత్కర్ అన్నారు. మత మార్పిడుల ఆరోపణలపై గత కొన్ని నెలలుగా చర్చిలు, క్రైస్తవ మిషనరీలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో బలవంతంగా మతమార్పిడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కొంతమంది కర్రలు, ఆయుధాలతో డాడి చేశారు. బలవంతంపు మత మార్పిళ్లకు నిషేదిస్తూ కర్ణాటక ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.
Miscreants damaged statue of #JesusChrist kept at altar & took money 4m donation box from a #Church in periyapatna #Mysuru. Priest was away when the incident happened.Miscreant,however,didn't damage the main statue of Jesus.We are looking into all the angles: cops #Karnataka pic.twitter.com/5jitzu80GB
— Imran Khan (@KeypadGuerilla) December 28, 2022
Karnataka | A church was allegedly vandalised y'day by some unknown miscreants in Piriyapatna in Mysuru. Various items kept in the church including the Baby Jesus statue were found damaged. pic.twitter.com/UAoLGPt0G5
— ANI (@ANI) December 28, 2022
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!