Church Vandalised : చర్చిని ధ్వంసం చేసిన దుండగులు.. కర్ణాటకలో ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Church Vandalised : కర్ణాటకలోని మైసూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ చర్చిని మంగళవారం కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు. బాల ఏసుక్రీస్తు విగ్రహాన్ని ముక్కలు చేశారు. క్రిస్మస్ వేడుకలు ముగిసిన రెండ్రోజుల తర్వాత ఈ దాడి జరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మైసూరులోని పెరియపట్నంలో ఉన్న సెయింట్ మేరీస్ చర్చిలో ఇటీవల క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే మంగళవారం రాత్రి కొందరు గుర్తుతెలియని దుండుగులు ఈ చర్చిని, ఏసు విగ్రహాన్ని కూడా ధ్వసంచేసినట్లు పోలీసులు తెలిపారు. చర్చి వెనుక తలుపులు పగుల గొట్టి లోపలికి ప్రవేశించారని అన్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని వారు తెలిపారు.
Read Also: Nasal Vaccine: బూస్టర్ డోస్ తీసుకున్న వారు నాసల్ వ్యాక్సిన్ వేసుకోవద్దు
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
దుండగులు దొంగతనం కోసమా, కేవలం దాడి కోసమా వచ్చారన్నది విచారణలో తేలుస్తామని పోలీసులు చెప్పారు. చర్చి వెలుపల ఉంచిన ఒక విరాళాల పెట్టేతో పాటు డబ్బును ఎత్తుకెళ్లారని చెప్పారు. దొంగతనం కేసుగా భావిస్తున్నామని మైసూర్పోలీస్ సూపరింటెండెంట్ సీమా లత్కర్ అన్నారు. మత మార్పిడుల ఆరోపణలపై గత కొన్ని నెలలుగా చర్చిలు, క్రైస్తవ మిషనరీలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో బలవంతంగా మతమార్పిడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కొంతమంది కర్రలు, ఆయుధాలతో డాడి చేశారు. బలవంతంపు మత మార్పిళ్లకు నిషేదిస్తూ కర్ణాటక ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.
Miscreants damaged statue of #JesusChrist kept at altar & took money 4m donation box from a #Church in periyapatna #Mysuru. Priest was away when the incident happened.Miscreant,however,didn't damage the main statue of Jesus.We are looking into all the angles: cops #Karnataka pic.twitter.com/5jitzu80GB
— Imran Khan (@KeypadGuerilla) December 28, 2022
Karnataka | A church was allegedly vandalised y'day by some unknown miscreants in Piriyapatna in Mysuru. Various items kept in the church including the Baby Jesus statue were found damaged. pic.twitter.com/UAoLGPt0G5
— ANI (@ANI) December 28, 2022
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!