PM Narendra Modi: ఎనిమిదేళ్లలో అశాంతి, అవినీతికి రెడ్ కార్డ్ ఇచ్చాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: మేఘాలయలోని షిల్లాంగ్ జరిగిన ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ ఎనిమిదేళ్ల ఈశాన్య భారత్లో అభివృద్ధికి అడ్డుగా నిలిచిన అవినీతి, అశాంతి, రాజకీయ అనుకూలత వంటి అన్ని అడ్డంకులకు తమ ప్రభుత్వం రెడ్ కార్డ్ ఇచ్చిందన్నారు. ఫుట్బాల్ మైదానంలో ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రధాని తన సందేశాన్ని ఇవ్వడానికి క్రీడా సూచనలను ఉపయోగించారు. ఫుట్బాల్లో ఎవరైనా క్రీడా స్పూర్తికి వ్యతిరేకంగా ఆడితే వారికి రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపుతారని.. అదే విధంగా ఈశాన్య ప్రాంతంలో గత 8 ఏళ్లలో సర్కారు అభివృద్ధికి అడ్డంగా నిలిచిన అడ్డంకులకు రెడ్కార్డు ఇచ్చామన్నారు.
ఈశాన్య ప్రాంతంలో క్రీడల అభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని, దేశంలోనే మొదటి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయంతో పాటు ఈ ప్రాంతంలో 90 ప్రధాన క్రీడా ప్రాజెక్టులు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి చెప్పారు. ఇవాళ ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్ జరగాల్సి ఉండగా.. తాము ఇక్కడ షిల్లాంగ్లో ఫుట్బాల్ అభిమానుల మధ్య ఒక ఫుట్బాల్ మైదానంలో ర్యాలీ నిర్వహించడం యాదృచ్ఛికమన్నారు. ఖతార్లో ఇవాళ ఫుట్బాల్ పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో ఎయిర్ కనెక్టివిటీని పెంచిన ఘనత కూడా ప్రభుత్వం సొంతం చేసుకుందన్నారు. 2014కి ముందు ఈశాన్య ప్రాంతంలో వారానికి 900 విమానాలు మాత్రమే అందుబాటులో ఉండేవని.. ఇప్పుడు 1,900 విమానాలకు పైగా ఉన్నాయని ప్రధాని అన్నారు. కృషి ఉడాన్ యోజన ద్వారా ఈశాన్య ప్రాంత రైతులకు మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ సహాయం చేస్తోందని అన్నారు.ఆగస్టు 2020లో ప్రారంభించబడిన కృషి ఉడాన్ యోజన పథకం, వ్యవసాయ ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో రవాణా చేయడంలో రైతులకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ఇది వారి విలువను మెరుగుపరుస్తుంది.
Also Read
- India - Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
Bilawal Bhutto Row: భుట్టో తల తీసుకొస్తే రూ.2కోట్ల రివార్డు.. బీజేపీ నేత ఆఫర్
టెలికాం కనెక్టివిటీపై, ఈశాన్య రాష్ట్రాలకు ఆరు వేల మొబైల్ టవర్లు వస్తాయని, దీని కోసం కేంద్రం రూ.5,000 కోట్లు వెచ్చిస్తోందని ప్రధాని చెప్పారు. వివిధ అభివృద్ధి పథకాల గురించి, రాబోయే 150 ఏకలవ్య మోడల్ పాఠశాలల గురించి, అలాగే ఈశాన్య ప్రాంతాలకు పర్బత్ మాల స్కీమ్, పీఎం డివైన్ ప్రాజెక్ట్ వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించిందని ప్రధాని తెలిపారు. . కేంద్రంలోని గత ప్రభుత్వాలపై కూడా ఆయన మండిపడ్డారు. గత ఏడాది వాటికన్ పర్యటన గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. గత ఏడాది వాటికన్ సిటీ వెళ్లి పోప్ను కలిశానని.. ఆయనను భారత్కు ఆహ్వానించామన్నారు. ఆ సమావేశం తనపై చాలా ప్రభావం చూపిందని పీఎం వెల్లడించారు.
అంతకుముందు నార్త్ ఈస్ట్ కౌన్సిల్ (NEC) స్వర్ణోత్సవ వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ, షిల్లాంగ్లో జరిగిన బహిరంగ కార్యక్రమంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రణాళిక, అమలు కోసం 1972లో ఏర్పాటైన ప్రాంతీయ ప్రణాళికా సంఘం ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరియు ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా పాల్గొన్నారు. షిల్లాంగ్లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రధాన మంత్రి రూ.2,450 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టుల ప్రారంభించి, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేశారు.
తాజావార్తలు
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!