PM Narendra Modi: ఎనిమిదేళ్లలో అశాంతి, అవినీతికి రెడ్ కార్డ్ ఇచ్చాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: మేఘాలయలోని షిల్లాంగ్ జరిగిన ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ ఎనిమిదేళ్ల ఈశాన్య భారత్లో అభివృద్ధికి అడ్డుగా నిలిచిన అవినీతి, అశాంతి, రాజకీయ అనుకూలత వంటి అన్ని అడ్డంకులకు తమ ప్రభుత్వం రెడ్ కార్డ్ ఇచ్చిందన్నారు. ఫుట్బాల్ మైదానంలో ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రధాని తన సందేశాన్ని ఇవ్వడానికి క్రీడా సూచనలను ఉపయోగించారు. ఫుట్బాల్లో ఎవరైనా క్రీడా స్పూర్తికి వ్యతిరేకంగా ఆడితే వారికి రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపుతారని.. అదే విధంగా ఈశాన్య ప్రాంతంలో గత 8 ఏళ్లలో సర్కారు అభివృద్ధికి అడ్డంగా నిలిచిన అడ్డంకులకు రెడ్కార్డు ఇచ్చామన్నారు.
ఈశాన్య ప్రాంతంలో క్రీడల అభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని, దేశంలోనే మొదటి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయంతో పాటు ఈ ప్రాంతంలో 90 ప్రధాన క్రీడా ప్రాజెక్టులు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి చెప్పారు. ఇవాళ ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్ జరగాల్సి ఉండగా.. తాము ఇక్కడ షిల్లాంగ్లో ఫుట్బాల్ అభిమానుల మధ్య ఒక ఫుట్బాల్ మైదానంలో ర్యాలీ నిర్వహించడం యాదృచ్ఛికమన్నారు. ఖతార్లో ఇవాళ ఫుట్బాల్ పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో ఎయిర్ కనెక్టివిటీని పెంచిన ఘనత కూడా ప్రభుత్వం సొంతం చేసుకుందన్నారు. 2014కి ముందు ఈశాన్య ప్రాంతంలో వారానికి 900 విమానాలు మాత్రమే అందుబాటులో ఉండేవని.. ఇప్పుడు 1,900 విమానాలకు పైగా ఉన్నాయని ప్రధాని అన్నారు. కృషి ఉడాన్ యోజన ద్వారా ఈశాన్య ప్రాంత రైతులకు మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ సహాయం చేస్తోందని అన్నారు.ఆగస్టు 2020లో ప్రారంభించబడిన కృషి ఉడాన్ యోజన పథకం, వ్యవసాయ ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో రవాణా చేయడంలో రైతులకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ఇది వారి విలువను మెరుగుపరుస్తుంది.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Bilawal Bhutto Row: భుట్టో తల తీసుకొస్తే రూ.2కోట్ల రివార్డు.. బీజేపీ నేత ఆఫర్
టెలికాం కనెక్టివిటీపై, ఈశాన్య రాష్ట్రాలకు ఆరు వేల మొబైల్ టవర్లు వస్తాయని, దీని కోసం కేంద్రం రూ.5,000 కోట్లు వెచ్చిస్తోందని ప్రధాని చెప్పారు. వివిధ అభివృద్ధి పథకాల గురించి, రాబోయే 150 ఏకలవ్య మోడల్ పాఠశాలల గురించి, అలాగే ఈశాన్య ప్రాంతాలకు పర్బత్ మాల స్కీమ్, పీఎం డివైన్ ప్రాజెక్ట్ వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించిందని ప్రధాని తెలిపారు. . కేంద్రంలోని గత ప్రభుత్వాలపై కూడా ఆయన మండిపడ్డారు. గత ఏడాది వాటికన్ పర్యటన గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. గత ఏడాది వాటికన్ సిటీ వెళ్లి పోప్ను కలిశానని.. ఆయనను భారత్కు ఆహ్వానించామన్నారు. ఆ సమావేశం తనపై చాలా ప్రభావం చూపిందని పీఎం వెల్లడించారు.
అంతకుముందు నార్త్ ఈస్ట్ కౌన్సిల్ (NEC) స్వర్ణోత్సవ వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ, షిల్లాంగ్లో జరిగిన బహిరంగ కార్యక్రమంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రణాళిక, అమలు కోసం 1972లో ఏర్పాటైన ప్రాంతీయ ప్రణాళికా సంఘం ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరియు ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా పాల్గొన్నారు. షిల్లాంగ్లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రధాన మంత్రి రూ.2,450 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టుల ప్రారంభించి, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేశారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..