PM Narendra Modi: ఎనిమిదేళ్లలో అశాంతి, అవినీతికి రెడ్ కార్డ్ ఇచ్చాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: మేఘాలయలోని షిల్లాంగ్ జరిగిన ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ ఎనిమిదేళ్ల ఈశాన్య భారత్లో అభివృద్ధికి అడ్డుగా నిలిచిన అవినీతి, అశాంతి, రాజకీయ అనుకూలత వంటి అన్ని అడ్డంకులకు తమ ప్రభుత్వం రెడ్ కార్డ్ ఇచ్చిందన్నారు. ఫుట్బాల్ మైదానంలో ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రధాని తన సందేశాన్ని ఇవ్వడానికి క్రీడా సూచనలను ఉపయోగించారు. ఫుట్బాల్లో ఎవరైనా క్రీడా స్పూర్తికి వ్యతిరేకంగా ఆడితే వారికి రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపుతారని.. అదే విధంగా ఈశాన్య ప్రాంతంలో గత 8 ఏళ్లలో సర్కారు అభివృద్ధికి అడ్డంగా నిలిచిన అడ్డంకులకు రెడ్కార్డు ఇచ్చామన్నారు.
ఈశాన్య ప్రాంతంలో క్రీడల అభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని, దేశంలోనే మొదటి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయంతో పాటు ఈ ప్రాంతంలో 90 ప్రధాన క్రీడా ప్రాజెక్టులు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి చెప్పారు. ఇవాళ ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్ జరగాల్సి ఉండగా.. తాము ఇక్కడ షిల్లాంగ్లో ఫుట్బాల్ అభిమానుల మధ్య ఒక ఫుట్బాల్ మైదానంలో ర్యాలీ నిర్వహించడం యాదృచ్ఛికమన్నారు. ఖతార్లో ఇవాళ ఫుట్బాల్ పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో ఎయిర్ కనెక్టివిటీని పెంచిన ఘనత కూడా ప్రభుత్వం సొంతం చేసుకుందన్నారు. 2014కి ముందు ఈశాన్య ప్రాంతంలో వారానికి 900 విమానాలు మాత్రమే అందుబాటులో ఉండేవని.. ఇప్పుడు 1,900 విమానాలకు పైగా ఉన్నాయని ప్రధాని అన్నారు. కృషి ఉడాన్ యోజన ద్వారా ఈశాన్య ప్రాంత రైతులకు మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ సహాయం చేస్తోందని అన్నారు.ఆగస్టు 2020లో ప్రారంభించబడిన కృషి ఉడాన్ యోజన పథకం, వ్యవసాయ ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో రవాణా చేయడంలో రైతులకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ఇది వారి విలువను మెరుగుపరుస్తుంది.
Also Read
- Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
- Varuna Yagam: నాగార్జున సాగర్లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
- FCRA Bill: 'మా చట్టాల గురించి మీకెందుకు?'.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
Bilawal Bhutto Row: భుట్టో తల తీసుకొస్తే రూ.2కోట్ల రివార్డు.. బీజేపీ నేత ఆఫర్
టెలికాం కనెక్టివిటీపై, ఈశాన్య రాష్ట్రాలకు ఆరు వేల మొబైల్ టవర్లు వస్తాయని, దీని కోసం కేంద్రం రూ.5,000 కోట్లు వెచ్చిస్తోందని ప్రధాని చెప్పారు. వివిధ అభివృద్ధి పథకాల గురించి, రాబోయే 150 ఏకలవ్య మోడల్ పాఠశాలల గురించి, అలాగే ఈశాన్య ప్రాంతాలకు పర్బత్ మాల స్కీమ్, పీఎం డివైన్ ప్రాజెక్ట్ వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించిందని ప్రధాని తెలిపారు. . కేంద్రంలోని గత ప్రభుత్వాలపై కూడా ఆయన మండిపడ్డారు. గత ఏడాది వాటికన్ పర్యటన గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. గత ఏడాది వాటికన్ సిటీ వెళ్లి పోప్ను కలిశానని.. ఆయనను భారత్కు ఆహ్వానించామన్నారు. ఆ సమావేశం తనపై చాలా ప్రభావం చూపిందని పీఎం వెల్లడించారు.
అంతకుముందు నార్త్ ఈస్ట్ కౌన్సిల్ (NEC) స్వర్ణోత్సవ వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ, షిల్లాంగ్లో జరిగిన బహిరంగ కార్యక్రమంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రణాళిక, అమలు కోసం 1972లో ఏర్పాటైన ప్రాంతీయ ప్రణాళికా సంఘం ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరియు ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా పాల్గొన్నారు. షిల్లాంగ్లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రధాన మంత్రి రూ.2,450 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టుల ప్రారంభించి, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేశారు.
తాజావార్తలు
-
Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
-
AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
-
Varuna Yagam: నాగార్జున సాగర్లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
-
FCRA Bill: ‘మా చట్టాల గురించి మీకెందుకు?’.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
-
Sarfaraz Khan: నేను ఇమడలేకపోతున్నాను.. కానీ పోరాడతా’.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్.. అసలు అర్థం ఇదేనా?
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!