MLA KP Nagarjuna Reddy: మార్కాపురం ప్రజల రుణాన్ని తీర్చుకోలేను.. గిద్దలూరులో పోటీకి రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA KP Nagarjuna Reddy: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మార్పులు, చేర్పులు జరుగుతూనే ఉన్నాయి.. కొందరు సిట్టింగ్లకు మొండి చేయి ఇచ్చింది అధిష్టానం.. మరికొందరికి స్థానాలను మార్చింది.. ఈ నేపథ్యంలోనే.. మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కేపీ నాగార్జునరెడ్డిని గిద్దలూరు అసెంబ్లీకి పంపాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.. ఇక, వైసీపీ అధినేత, సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన కేపీ నాగార్జున రెడ్డి.. త్వరలో జరగబోయే ఎన్నికల్లో గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సీఎం జగన్ తనకు సువర్ణ అవకాశం ఇచ్చారని, ఆ ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
Read Also: Vivek Taneja: వాషింగ్టన్లో దాడి.. మృతిచెందిన భారత సంతతి వ్యాపారవేత్త!
Also Read
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి.. తన తండ్రి కేపీ కొండారెడ్డి 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నారని.. మూడు దఫాలుగా సమితి ప్రెసిడెంట్గా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా మార్కాపురం నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస్తూ వచ్చారు.. తన మామ ఉడుముల శ్రీనివాసుల రెడ్డి కంభం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవచేయడంతో 2019లో సీఎం వైఎస్ జగన్ తనకు మార్కాపురం వైసీపీ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.. పార్టీ కార్యకర్తలు, ప్రజలు, వారికి జగనన్న మీద ఉన్న అభిమానంతో తనను 18,600 మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపారన్నారు. ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్దికి ఎంతో కృషి చేశా.. సీఎం జగన్ సహకారంతో మార్కాపురానికి మెడికల్ కాలేజీ, షాదీఖానా, బీసీభవన్, అంబేద్కర్ భవన్, పొదిలి పెద్దచెరువు అభివృద్ధి, మార్కాపురానికి రెండో ఫేజ్ నీటి సరఫరా పథకం తదితర అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపట్టానని వెల్లడించారు.. ఇక, శాశ్వతంగా కరువును నివారించే వెలిగొండ ప్రాజెక్టు కూడా పూర్తైందన్నారు. ఐదేళ్లలో తాను ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి గడప గడపకు మన ప్రభుత్వం, వైఎస్సార్ సీపీ ప్లీనరీ, సామాజిక సాధికార బస్సుయాత్ర తదితర కార్యక్రమాలన్నీ సమర్ధవంతంగా నిర్వహించాననీ, ప్రజల ఆదరణ, అభిమానాన్ని తాను ఎన్నడూ మర్చిపోలేనన్నారు. ఇవి కాకుండా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాం.. అందరి సహకారంతోనే మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగాను.. అందరికీ పేరుపేరునా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు కేపీ నాగార్జున రెడ్డి.. ఇక, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను సీఎం వైఎస్ జగన్.. గిద్దలూరు నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తూ సువర్ణ అవకాశం కల్పించారని, ఆయనకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. గిద్దలూరు కూడా పశ్చిమ ప్రకాశంలో భాగమేనన్నారు. నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో జగనన్న సహకారంతో అభివృద్ధి చేస్తానని, ఆ ప్రాంత ప్రజలకు సేవచేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి.
తాజావార్తలు
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్బ్యాక్ దక్కిందా?
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!