Reactor Explosion: రియాక్టర్ పేలుడు, ఐదుగురు మృతి.. కలెక్టర్తో మాట్లాడిన సీఎం చంద్రబాబు
- అచ్యుతాపురం సెజ్ ఘటనలో పెరుగుతున్న మృతులు
- రియాక్టర్ పేలుడు ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి
- మరో 13 మందికి గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స
- రియాక్టర్ పేలుడు ధాటికి దెబ్బతిన్న పరిశ్రమ భవనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reactor Explosion: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 13 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్ పేలుడు ధాటికి పరిశ్రమ భవనం దెబ్బతింది. ఎసైన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులతో పరిశ్రమ ప్రాంగణం నిండిపోయింది.
Read Also: AP CM Chandrababu: నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీసు శాఖ పని చేయాలి..
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలిన ప్రమాదంపై సీఎం చంద్రబాబు కలెక్టరుతో మాట్లాడారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అందుతున్న వైద్యంపై కలెక్టరుతో మాట్లాడారు. తక్షణం సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ పేలుడు ఘటనపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం దగ్గర ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం దురదృష్టకరమన్నారు. పలువురు ప్రాణాలు కోల్పోయారని, 13 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని.. కలెక్టరు, ఎస్పీలు పరిస్థితి సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. ఎంత మంది చనిపోయారో తెలియడానికి కొంత సమయం పడుతుందన్నారు. రియాక్టర్ బ్లాస్ట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని అంచనా వేశామన్నారు. కార్మిక శాఖ యంత్రాంగం అంతా అక్కడే ఉందన్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..