TG Congress: కేటీఆర్ అంశంలో సుప్రీం తీరుపై కాంగ్రెస్ నేతల రియాక్షన్..
- కేటీఆర్ అంశంలో సుప్రీం తీరుపై కాంగ్రెస్ నేతల రియాక్షన్
- కేటీఆర్కి ఒకవైపు గోడ దెబ్బ, ఇంకో వైపు చెంప దెబ్బ పడింది- ఆది శ్రీనివాస్
- ప్రజల సొమ్ము దోచుకొని కుంభకోణం లంభకోణం లేదని అంటావా..?- ఆది శ్రీనివాస్
- లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ సుప్రీంకోర్టు దాకా ఎందుకు వచ్చారు- అద్దంకి దయాకర్
- అన్ని దొంగతనాలు ప్రజలకు తెలుస్తాయి- అద్దంకి దయాకర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటీఆర్ అంశంలో సుప్రీం తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్కి ఒకవైపు గోడ దెబ్బ, ఇంకో వైపు చెంప దెబ్బ పడిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ప్రజల సొమ్ము దోచుకొని కుంభకోణం లంభకోణం లేదని అంటావా..? అని దుయ్యబట్టారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటే అక్రమ కేసులు అంటున్నారు.. తాము బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాగా తలుపులు విరగొట్టి అరెస్టు చేయడం లేదని అన్నారు. కేటీఆర్ ఇప్పుడు ప్రజలకి ఏం సమాధానం చెప్తారు.. కేటీఆర్ చేస్తున్న దానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆది శ్రీనివాస్ తెలిపారు.
Read Also: Stock Market: వరుసగా రెండో రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
Also Read
- Summer Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు.. ఎన్ని రోజుల వరకంటే..?
- Harish Rao : అబద్ధాల రేవంత్ రెడ్డి.. నా గురించి మాట్లాడే హక్కు నీకుందా.?
- Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
- West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. "కట్మనీ"పై టీఎంసీలో భయం..
కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి రౌడీలతో కేటీఆర్ రాజకీయం చేస్తున్నారు.. అధికారులు, ఎమ్మెల్యేలు అందరిపైనా దాడులు చేసేది బీఆర్ఎస్ నేతలేనని ఆరోపించారు. దాడుల సంస్కృతిని బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుంది.. కేటీఆర్ సహా అవినీతి చేసిన వాళ్లంతా ఉండాల్సింది జైల్లో అని పేర్కొన్నారు. జైల్లో ఉండాల్సిన వాళ్లు బయట రకరకాల మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ సుప్రీంకోర్టు దాకా ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అన్ని దొంగతనాలు ప్రజలకు తెలుస్తాయి.. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని తెలిపారు. ప్రశ్నిస్తే అరెస్టులా అంటున్న బీఆర్ఎస్ నేతలు.. 10 ఏళ్లలో చేసింది ఏమిటి అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కోదండ రామ్, మందకృష్ణ మాదిగ, విమలక్క సహా ప్రజాస్వామ్యక వాదులు, ప్రతిపక్ష నేతలు మీద బీఆర్ఎస్ ఏం చేసిందో అందరికీ తెలుసని అన్నారు. ప్రజలే దాడులు చేసే సంస్కృతిని బీఆర్ఎస్ నేతలు తెచ్చుకోవద్దని అద్దంకి దయాకర్ సూచించారు.
Read Also: PPF Scheme: బెస్ట్ పెట్టుబడి స్కీమ్.. రోజుకు రూ. 50 పొదుపు చేస్తే చాలు.. చేతికి రూ. 5 లక్షలు
తాజావార్తలు
-
Summer Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు.. ఎన్ని రోజుల వరకంటే..?
-
Harish Rao : అబద్ధాల రేవంత్ రెడ్డి.. నా గురించి మాట్లాడే హక్కు నీకుందా.?
-
Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
-
iPhone 18, iPhone 18 Pro: ఐఫోన్ 18, ఐఫోన్ 18 ప్రో సిరీస్పై లీకులు.. డిస్ప్లే, కెమెరా, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు!
-
Nara Lokesh : ఏపీ శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..