RBI: రుణాలు తీసుకుంటే అవి మాఫీ అవుతాయని ప్రచారం చేస్తూ కొన్ని సంస్థలు వినియోగదారులను మభ్యపెడుతున్నాయి. ఆఫర్ల పేరుతో వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దాంతోపాటు బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు రుణ మొత్తం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని వినియోగదారులకు చెబుతున్నాయి. సర్వీస్ రుసుము పేరుతో నగదు వసూలు చేసి రుణమాఫీ ధ్రువపత్రాలను జారీ చేస్తున్నాయి. ఈ ప్రకటనలు ఆర్బీఐ దృష్టికి రావడంతో.. వాటిని నమ్మొద్దని వినియోగదారులను వార్నింగ్ ఇచ్చింది. రుణమాఫీ ఆఫర్ల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆర్బీఐ హెచ్చరించింది. రుణాలు తీసుకుంటే అవి మాఫీ అవుతాయని ప్రచారం చేస్తూ కొన్ని సంస్థలు వినియోగదారులను మభ్యపెడుతున్నాయని తెలిపింది. ఇలాంటి ప్రచారం ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని, డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది. నకిలీ ప్రకటనలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ సూచించింది.
Read Also: Rajinikanth: ఇలాంటి సూపర్ స్టార్ ని చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్…
రుణమాఫీ ఆఫర్ల పేరుతో వార్తా పత్రికలు, సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి మోసపోవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రజలను హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. “కొన్ని కంపెనీలు రుణమాఫీ ఆఫర్ల పేరుతో వార్తా పత్రికలు, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. సర్వీస్/లీగల్ ఫీజు పేరుతో నగదు వసూలు చేసి రుణమాఫీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఈ సంస్థలకు ఎలాంటి అనుమతి లేదు. కొందరు వ్యక్తులు, సంస్థలు ఇలాంటి మోసపూరిత ప్రకటనలను ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా, బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని వినియోగదారులకు చెబుతాయి. ఇటువంటి ప్రచారం ఆర్థిక సంస్థల స్థిరత్వం మరియు డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. అటువంటి సంస్థలతో సంబంధం కలిగి ఉండటం వలన ఆర్థిక నష్టాలు వస్తాయి. వినియోగదారులు ఇలాంటి ప్రకటనలను నమ్మవద్దు. వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని తన తన ప్రకటనలో పేర్కొంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).