RBI: ఆర్బీఐ వార్నింగ్.. వాటిని నమ్మి మోసపోవద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI: రుణాలు తీసుకుంటే అవి మాఫీ అవుతాయని ప్రచారం చేస్తూ కొన్ని సంస్థలు వినియోగదారులను మభ్యపెడుతున్నాయి. ఆఫర్ల పేరుతో వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దాంతోపాటు బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు రుణ మొత్తం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని వినియోగదారులకు చెబుతున్నాయి. సర్వీస్ రుసుము పేరుతో నగదు వసూలు చేసి రుణమాఫీ ధ్రువపత్రాలను జారీ చేస్తున్నాయి. ఈ ప్రకటనలు ఆర్బీఐ దృష్టికి రావడంతో.. వాటిని నమ్మొద్దని వినియోగదారులను వార్నింగ్ ఇచ్చింది. రుణమాఫీ ఆఫర్ల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆర్బీఐ హెచ్చరించింది. రుణాలు తీసుకుంటే అవి మాఫీ అవుతాయని ప్రచారం చేస్తూ కొన్ని సంస్థలు వినియోగదారులను మభ్యపెడుతున్నాయని తెలిపింది. ఇలాంటి ప్రచారం ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని, డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది. నకిలీ ప్రకటనలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ సూచించింది.
Read Also: Rajinikanth: ఇలాంటి సూపర్ స్టార్ ని చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్…
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
రుణమాఫీ ఆఫర్ల పేరుతో వార్తా పత్రికలు, సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి మోసపోవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రజలను హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. “కొన్ని కంపెనీలు రుణమాఫీ ఆఫర్ల పేరుతో వార్తా పత్రికలు, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. సర్వీస్/లీగల్ ఫీజు పేరుతో నగదు వసూలు చేసి రుణమాఫీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఈ సంస్థలకు ఎలాంటి అనుమతి లేదు. కొందరు వ్యక్తులు, సంస్థలు ఇలాంటి మోసపూరిత ప్రకటనలను ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా, బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని వినియోగదారులకు చెబుతాయి. ఇటువంటి ప్రచారం ఆర్థిక సంస్థల స్థిరత్వం మరియు డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. అటువంటి సంస్థలతో సంబంధం కలిగి ఉండటం వలన ఆర్థిక నష్టాలు వస్తాయి. వినియోగదారులు ఇలాంటి ప్రకటనలను నమ్మవద్దు. వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని తన తన ప్రకటనలో పేర్కొంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!