Manappuram Finance: రూల్స్ అతిక్రమించిన మణప్పురం ఫైనాన్స్.. రూ.20లక్షల జరిమానా వేసిన ఆర్బీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manappuram Finance: మణప్పురం ఫైనాన్స్ భారతదేశంలోని ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC). ఇది బంగారు రుణాలను అందిస్తోంది. తాజాగా ఈ కంపెనీ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుండి గట్టి చర్యను ఎదుర్కొంది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు నిర్దేశించిన నిబంధనలలోని కొన్నింటిని పాటించనందుకు మణప్పురం ఫైనాన్స్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 20 లక్షల జరిమానా విధించింది. కంపెనీ నుండి అసంతృప్తికరమైన ప్రతిస్పందన ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు రెగ్యులేటర్ తెలిపింది.
రెగ్యులేటరీ సమ్మతిలో లోపాల ఆధారంగా బంగారంపై రుణం ఇచ్చే కంపెనీపై ఈ జరిమానా విధించినట్లు ఆర్బిఐ తెలిపింది. మణప్పురం ఫైనాన్స్ 90 రోజులకు పైగా పెండింగ్లో ఉన్న బకాయిలను నిరర్థక ఆస్తులుగా (ఎన్పిఎ) వర్గీకరించలేదని తెలిసింది. పాట్నాకు చెందిన బీహార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ తరపున నిబంధనల ఉల్లంఘన కేసు తెరపైకి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను పట్టించుకోకపోవడంతో బ్యాంకుకు భారీ నష్టం వాటిల్లింది. రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినందుకు పాట్నాలోని బీహార్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రూ. 60.20 లక్షల జరిమానా విధించింది. బ్యాంకుల రోజువారీ పనితీరుకు సంబంధించి RBI కఠినమైన నిబంధనలను రూపొందించిందని.. దేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ, సహకార బ్యాంకుల పనితీరును ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్ సమీక్షిస్తూనే ఉంటుంది.
Also Read
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
Read Also:Barber Shop: మసాజ్ కోసం వెళ్ళిన కస్టమర్.. మెడ ఖాళీ చేసి పంపిన బార్బర్
అనుమానాస్పద లావాదేవీల అనుమానం
2019-20 ఆర్థిక సంవత్సరం తర్వాత నాబార్డు చేసిన తనిఖీల్లో ఈ బ్యాంకులో కొనసాగుతున్న అవకతవకలు బయటపడినట్లు ఆర్బీఐ ఆ ప్రకటనలో తెలిపింది. అనుమానాస్పద లావాదేవీలను ఫ్లాగ్ చేయడానికి, వాటిని నివేదించడానికి సహకార బ్యాంకు సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయడంలో విఫలమైందని నాబార్డ్ విచారణలో తేలింది. చట్టబద్ధమైన సమాచారాన్ని కూడా బ్యాంకు నిర్ణీత సమయంలోగా ఇవ్వలేదు. అనుమానాస్పద లావాదేవీల గురించి సమాచారాన్ని పొందడానికి బ్యాంకులను సాంకేతికంగా బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. దీని కింద బ్యాంకులు సాఫ్ట్వేర్ సహాయంతో అనుమానాస్పద లావాదేవీల గురించి సమాచారాన్ని పొందుతాయి.. మోసాలను నిశితంగా గమనిస్తాయి.
Read Also:Fire Accident: ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్ లో అగ్నిప్రమాదం.. కస్టమర్స్ ఏంచేశారంటే..
క్రెడిట్ ఏజెన్సీలకు కూడా సమాచారం లేదు
రిజర్వ్ బ్యాంక్ తన చర్యల వివరాలను తెలియజేస్తూ.. సహకార బ్యాంకు నాలుగు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు డేటా వివరాలను అందించడంలో.. డైరెక్టర్ల వినియోగదారుల సేవా కమిటీని ఏర్పాటు చేయడంలో విఫలమైందని తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ బ్యాంక్కు నోటీసు జారీ చేయబడిందని.. దాని ప్రత్యుత్తరాన్ని పరిశీలించిన తర్వాత, జరిమానా విధించాలని నిర్ణయించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ చర్యను ఎదుర్కొనేది పాట్నా బ్యాంక్ మాత్రమే కాదు. ఇది కాకుండా మేఘాలయలోని జోవై కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్పై రిజర్వ్ బ్యాంక్ రూ.6 లక్షల జరిమానా విధించింది.
తాజావార్తలు
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!