Penalty On Banks: ఆర్బీఐ మరో కఠిన చర్య.. ఎస్బీఐ సహా మూడు బ్యాంకులకు భారీ జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Penalty On Banks: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. ఈసారి మూడు బ్యాంకులపై ఆర్బీఐ వేటు పడింది. వీటిలో దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ ఉన్నాయి. వివిధ నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ బ్యాంకులపై సుమారు రూ.3 కోట్ల జరిమానా విధించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గరిష్టంగా రూ.2 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్బీఐ సోమవారం తెలిపింది. డిపాజిటర్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్ 2014లోని కొన్ని నిబంధనలను బ్యాంక్ ఉల్లంఘించిందని ఆరోపించింది. సిటీ యూనియన్ బ్యాంకుపై సెంట్రల్ బ్యాంక్ రూ.66 లక్షల జరిమానా విధించింది. NPA ఖాతాలకు సంబంధించిన ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, ముందస్తు కేటాయింపు నియమాలకు సంబంధించిన ఆర్బీఐ నియమాలు, అలాగే నో యువర్ డైరెక్షన్ నియమాన్ని బ్యాంక్ ఉల్లంఘించిందని ఆరోపించింది. కెనరా బ్యాంకు కూడా కొన్ని మార్గదర్శకాలను పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల బ్యాంకుకు రూ.32.30 లక్షల జరిమానా విధించారు.
Read Also:Reddy Appalanaidu: ఏలూరు జనసేన ఇంచార్జ్ అసంతృప్తి.. పార్టీపై సంచలన వ్యాఖ్యలు
Also Read
- Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
ఒడిశాలోని రూర్కెలాలో ఉన్న ఓషన్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్పై కూడా రూ.16 లక్షల జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఎన్బిఎఫ్సి (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు)కి సంబంధించిన నిబంధనలను కంపెనీ పాటించడం లేదని ఆరోపించారు. రెగ్యులేటరీ స్క్రూటినీ తర్వాత ఆర్బీఐ ఎప్పటికప్పుడు అలాంటి చర్యలను తీసుకుంటూనే ఉంటుంది. రెగ్యులేటరీ విచారణలో లోపాలను గుర్తించిన తర్వాత ఈ జరిమానా విధించబడుతుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఈ నిర్ణయాలు బ్యాంకు ఖాతాదారులపై ఎలాంటి ప్రభావం చూపవు.
Read Also:Mukesh Ambani: అంబానీ ఇంట పెళ్లి సందడి..మూడు రోజులు జరిగే ఈవెంట్స్ ఇవే..
జనవరి 31న నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా డిపాజిట్లు తీసుకోకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను సెంట్రల్ బ్యాంక్ నిషేధించింది. ఆర్డర్ ప్రకారం, పేమెంట్స్ బ్యాంక్ మార్చి 15 తర్వాత డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్ అప్ చేయకూడదు. సోమవారం నాడు పేటీఎం పేమెంట్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. One97 కమ్యూనికేషన్ లిమిటెడ్ Paytm పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుండి తన నామినీని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత విజయ్ శేఖర్ శర్మ బోర్డు సభ్యుని పదవికి కూడా రాజీనామా చేశారు. Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ భవిష్యత్తు వ్యాపారం ఇప్పుడు పునర్నిర్మించిన బోర్డు ద్వారా నిర్వహించబడుతుంది.
తాజావార్తలు
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!