Axis Bank : నిర్లక్ష్యం వహించిన యాక్సిస్ బ్యాంక్.. ఆర్బీఐ భారీ జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Axis Bank : ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కొద్దిపాటి అజాగ్రత్త వల్ల భారీగా నష్టపోవాల్సి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దానికి సుమారు రూ.91 లక్షల జరిమానా విధించింది. దీనితో పాటు గోల్డ్ లోన్ ఇచ్చే కంపెనీ మణప్పురం ఫైనాన్స్, ఫైనాన్స్ రంగానికి చెందిన ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ కంపెనీలపై కూడా జరిమానా విధించబడింది. రెండు కంపెనీలు కూడా భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. KYC మార్గదర్శకాలు-2016లోని అనేక నిబంధనలను యాక్సిస్ బ్యాంక్ సరిగ్గా పాటించలేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది కాకుండా, బ్యాంకింగ్ సేవల అవుట్సోర్సింగ్, రుణ సంబంధిత రిస్క్ మేనేజ్మెంట్, కరెంట్ ఖాతాలను తెరవడం, మేనేజ్ చేయడం వంటి ఇతర నియమాలను కూడా పాటించలేదు. ఈ కారణంగా బ్యాంకు రూ.90.92 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
Read Also:Friday : కర్పూరంతో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది..!
Also Read
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
సెంట్రల్ బ్యాంక్ తన నియంత్రణ అధికారాలను ఉపయోగించి యాక్సిస్ బ్యాంక్పై ఈ పెనాల్టీని విధించింది. దీనికి సంబంధించి, RBI నవంబర్ 2న ఒక ఉత్తర్వును జారీ చేసింది. అయితే బ్యాంక్ దానిని కూడా అనుసరించలేకపోయింది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించకపోవడం వల్లే బ్యాంకుపై ఈ చర్య తీసుకున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తన ప్రకటనలో స్పష్టం చేసింది. బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటుకు సంబంధించి ఎటువంటి తీర్పును ఇవ్వడం దీని ఉద్దేశ్యం కాదు.
Read Also:Minister KTR : హైదరబాద్లో స్థిరబడిన అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాం
త్రిసూర్కు చెందిన మణప్పురం ఫైనాన్స్పై రూ.42.78 లక్షల జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేక ప్రకటనలో తెలియజేసింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించిన ‘సిస్టమాటిక్ ఇంపోర్ట్ నాన్-డిపాజిట్ టేకింగ్ కంపెనీ అండ్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ (రిజర్వ్ బ్యాంక్) గైడ్లైన్స్-2016’ని సరిగ్గా పాటించనందుకు ఈ పెనాల్టీ విధించబడింది. RBI నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (NBFCలు) కోసం కొన్ని నియమాలను రూపొందించింది. ఇప్పుడు కొన్ని NBFCలు సాధారణ కస్టమర్ల నుండి డిపాజిట్లు తీసుకోవచ్చు. కొన్నింటికి అలా అనుమతి లేదు. ఇందుకు సంబంధించిన నిబంధనలను పట్టించుకోని మణప్పురం ఫైనాన్స్పై రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధించింది. అదేవిధంగా, KYC (నో యువర్ కస్టమర్) నిబంధనలను పాటించనందుకు ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ లిమిటెడ్కు కూడా రూ. 20 లక్షల జరిమానా విధించబడింది.
తాజావార్తలు
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!