Axis Bank : నిర్లక్ష్యం వహించిన యాక్సిస్ బ్యాంక్.. ఆర్బీఐ భారీ జరిమానా
Axis Bank : ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కొద్దిపాటి అజాగ్రత్త వల్ల భారీగా నష్టపోవాల్సి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దానికి సుమారు రూ.91 లక్షల జరిమానా విధించింది. దీనితో పాటు గోల్డ్ లోన్ ఇచ్చే కంపెనీ మణప్పురం ఫైనాన్స్, ఫైనాన్స్ రంగానికి చెందిన ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ కంపెనీలపై కూడా జరిమానా విధించబడింది. రెండు కంపెనీలు కూడా భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. KYC మార్గదర్శకాలు-2016లోని అనేక నిబంధనలను యాక్సిస్ బ్యాంక్ సరిగ్గా పాటించలేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది కాకుండా, బ్యాంకింగ్ సేవల అవుట్సోర్సింగ్, రుణ సంబంధిత రిస్క్ మేనేజ్మెంట్, కరెంట్ ఖాతాలను తెరవడం, మేనేజ్ చేయడం వంటి ఇతర నియమాలను కూడా పాటించలేదు. ఈ కారణంగా బ్యాంకు రూ.90.92 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
Read Also:Friday : కర్పూరంతో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది..!
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
సెంట్రల్ బ్యాంక్ తన నియంత్రణ అధికారాలను ఉపయోగించి యాక్సిస్ బ్యాంక్పై ఈ పెనాల్టీని విధించింది. దీనికి సంబంధించి, RBI నవంబర్ 2న ఒక ఉత్తర్వును జారీ చేసింది. అయితే బ్యాంక్ దానిని కూడా అనుసరించలేకపోయింది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించకపోవడం వల్లే బ్యాంకుపై ఈ చర్య తీసుకున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తన ప్రకటనలో స్పష్టం చేసింది. బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటుకు సంబంధించి ఎటువంటి తీర్పును ఇవ్వడం దీని ఉద్దేశ్యం కాదు.
Read Also:Minister KTR : హైదరబాద్లో స్థిరబడిన అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాం
త్రిసూర్కు చెందిన మణప్పురం ఫైనాన్స్పై రూ.42.78 లక్షల జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేక ప్రకటనలో తెలియజేసింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించిన ‘సిస్టమాటిక్ ఇంపోర్ట్ నాన్-డిపాజిట్ టేకింగ్ కంపెనీ అండ్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ (రిజర్వ్ బ్యాంక్) గైడ్లైన్స్-2016’ని సరిగ్గా పాటించనందుకు ఈ పెనాల్టీ విధించబడింది. RBI నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (NBFCలు) కోసం కొన్ని నియమాలను రూపొందించింది. ఇప్పుడు కొన్ని NBFCలు సాధారణ కస్టమర్ల నుండి డిపాజిట్లు తీసుకోవచ్చు. కొన్నింటికి అలా అనుమతి లేదు. ఇందుకు సంబంధించిన నిబంధనలను పట్టించుకోని మణప్పురం ఫైనాన్స్పై రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధించింది. అదేవిధంగా, KYC (నో యువర్ కస్టమర్) నిబంధనలను పాటించనందుకు ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ లిమిటెడ్కు కూడా రూ. 20 లక్షల జరిమానా విధించబడింది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో