Axis Bank : నిర్లక్ష్యం వహించిన యాక్సిస్ బ్యాంక్.. ఆర్బీఐ భారీ జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Axis Bank : ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కొద్దిపాటి అజాగ్రత్త వల్ల భారీగా నష్టపోవాల్సి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దానికి సుమారు రూ.91 లక్షల జరిమానా విధించింది. దీనితో పాటు గోల్డ్ లోన్ ఇచ్చే కంపెనీ మణప్పురం ఫైనాన్స్, ఫైనాన్స్ రంగానికి చెందిన ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ కంపెనీలపై కూడా జరిమానా విధించబడింది. రెండు కంపెనీలు కూడా భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. KYC మార్గదర్శకాలు-2016లోని అనేక నిబంధనలను యాక్సిస్ బ్యాంక్ సరిగ్గా పాటించలేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది కాకుండా, బ్యాంకింగ్ సేవల అవుట్సోర్సింగ్, రుణ సంబంధిత రిస్క్ మేనేజ్మెంట్, కరెంట్ ఖాతాలను తెరవడం, మేనేజ్ చేయడం వంటి ఇతర నియమాలను కూడా పాటించలేదు. ఈ కారణంగా బ్యాంకు రూ.90.92 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
Read Also:Friday : కర్పూరంతో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది..!
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
సెంట్రల్ బ్యాంక్ తన నియంత్రణ అధికారాలను ఉపయోగించి యాక్సిస్ బ్యాంక్పై ఈ పెనాల్టీని విధించింది. దీనికి సంబంధించి, RBI నవంబర్ 2న ఒక ఉత్తర్వును జారీ చేసింది. అయితే బ్యాంక్ దానిని కూడా అనుసరించలేకపోయింది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించకపోవడం వల్లే బ్యాంకుపై ఈ చర్య తీసుకున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తన ప్రకటనలో స్పష్టం చేసింది. బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటుకు సంబంధించి ఎటువంటి తీర్పును ఇవ్వడం దీని ఉద్దేశ్యం కాదు.
Read Also:Minister KTR : హైదరబాద్లో స్థిరబడిన అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాం
త్రిసూర్కు చెందిన మణప్పురం ఫైనాన్స్పై రూ.42.78 లక్షల జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేక ప్రకటనలో తెలియజేసింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించిన ‘సిస్టమాటిక్ ఇంపోర్ట్ నాన్-డిపాజిట్ టేకింగ్ కంపెనీ అండ్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ (రిజర్వ్ బ్యాంక్) గైడ్లైన్స్-2016’ని సరిగ్గా పాటించనందుకు ఈ పెనాల్టీ విధించబడింది. RBI నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (NBFCలు) కోసం కొన్ని నియమాలను రూపొందించింది. ఇప్పుడు కొన్ని NBFCలు సాధారణ కస్టమర్ల నుండి డిపాజిట్లు తీసుకోవచ్చు. కొన్నింటికి అలా అనుమతి లేదు. ఇందుకు సంబంధించిన నిబంధనలను పట్టించుకోని మణప్పురం ఫైనాన్స్పై రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధించింది. అదేవిధంగా, KYC (నో యువర్ కస్టమర్) నిబంధనలను పాటించనందుకు ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ లిమిటెడ్కు కూడా రూ. 20 లక్షల జరిమానా విధించబడింది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!