Zero Balance : బ్యాంకు ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. గుడ్న్యూస్ చెప్పిన ఆర్బీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zero Balance : బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త వినిపించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఇంతకీ ఆర్బీఐ చెప్పిన ఆ గుడ్న్యూస్ ఏంటి అనే విషయంలోకి వెళ్తే.. బ్యాంక్ ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి ఫైన్ విధించకూడదు బ్యాంకులు.. ఇది బ్యాంకు ఖాతాదారులకు ఊరట కల్పించే విషయంగానే చెప్పుకోవాలి.. భారత బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా కీలక భూమిక పోషిస్తున్నాయి.. ఈ రోజుల్లో అయితే, బ్యాంకు ఖాతా లేనివారు చాలా తక్కువే.. ఎందుకంటే.. ప్రభుత్వ స్కీమ్లకు సంబంధించిన సొమ్ముల నుంచి.. ఉద్యోగానికి సంబంధించిన జీతం సహా అన్నీ బ్యాంకులకే ముడిపడి ఉంటున్నాయి.. ఇదే సమయంలో కొందరికైతే రెండు లేదా మూడు అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు..
కానీ, బ్యాంక్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ కొందరికి సమస్య గానే మారిపోయింది.. బ్యాంక్ ఖాతాలున్న వారిలో వ్యాపారులు, సంస్థలు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు, కర్షకులు, కార్మికులు, గృహిణిలు, విద్యార్థులు ఇలా చాలా మందే ఉంటారు.. ఒక్కోసారి ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకుంటే బ్యాంకులు ఫైన్ విధిస్తూ వస్తున్నాయి.. కొన్ని బ్యాంకుల్లో మినీమమ్ బ్యాలెన్స్ వెయ్యి రూపాయలుగా ఉండగా.. మరికొన్నింటిలో రూ.2 వేల నుంచి రూ.3 వేలు.. ఇంకా కొన్ని బ్యాంకుల్లో అయితే రూ. 5 వేల నుంచి రూ.10 వేల వరకు మినిమం బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇది చాలా మందికి సమస్యగా మారింది.. ముఖ్యంగా.. ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగులు తరచూ కంపెనీలు మారే సందర్భాలు ఉంటాయి.. ఇదే సమయంలో.. ఆ సంస్ధ వారి ఉద్యోగులకు ఓ బ్యాంకులో ఖాతా తెరుస్తూ ఉంటుంది.. ఇలా రెండు, మూడు సంస్థలుమారినవారికి రెండు, మూడు ఖాతాలు ఉంటాయి… ఒక సంస్థలో ఉద్యోగం మానేసిన తర్వాత.. ఆ ఖాతాలో జీతం పడకుండా పోయి.. బ్యాలెన్స్ కూడా లేకుండా పోతే.. చార్జీలు వసూలు చేస్తున్నాయి ఆయా బ్యాంకులు.. మినిమం బ్యాలెన్స్ కంటే తక్కువగా ఉంటే.. ఫైన్ల రూపంలో.. క్రమంగా బ్యాంకులో ఉన్న మొత్తం కట్ చేస్తూనే ఉన్నాయి బ్యాంకులు..
Also Read
- 144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
అంతేకాదు.. వేరే అవసరాల కోసం డబ్బులు వేసినా.. అందులో నుంచి ఛార్జీలు కట్ చేస్తున్నారు.. దీనిపై అనేక రకాల ఫిర్యాదులు అందడంతో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.. సేవింగ్ అకౌంట్లో సున్నా బ్యాలెన్స్ ఉన్నా.. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ కింద విధించే చార్జీలను నిలిపివేయాలని బ్యాంకులను కోరింది ఆర్బీఐ.. దీంతో, కొన్ని బ్యాంకులు ఆ దిశగా చర్యలు చేపట్టాయి.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మినిమం బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయకపోయినా ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది.. యాక్సిస్ బ్యాంక్ కూడా ఇదే దారిలో వెళ్తుంది.. మరికొన్ని బ్యాంకులు సైతం ఇదే ఆలోచనలో ఉన్నాయి..
- Tags
- bank
- banks
- charges
- RBI
- zero balance
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?