RBI: బ్యాంక్ కస్టమర్లకు షాక్.. ఏటీఎం ఛార్జీలు పెంపు.. అమల్లోకి ఎప్పటినుంచంటే?
- ఏటీఎం ఛార్జీలు పెంపు
- ఆర్బీఐ ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజుల పెంపుకు ఆమోదం
- మే 1 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక ఏటీఎంలకు వెళ్లేవారి సంఖ్య కాస్త తగ్గిందనే చెప్పాలి. అయినప్పటికీ చాలామంది ఏటీఎం సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే బ్యాంక్ కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. ఆర్బీఐ ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజుల పెంపుకు ఆమోదం తెలిపింది. ఆర్థిక లావాదేవీలకు రూ.2, ఆర్థికేతర లావాదేవీలకు రూ.1 చొప్పున ఛార్జీలను పెంచింది. మే 1 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఛార్జీల పెంపు పరిమిత ఏటీఎం నెట్వర్క్ కలిగిన చిన్న బ్యాంకులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని బ్యాంకు వర్గాలు భావిస్తున్నాయి.
Also Read:Hyderabad: మండి రెస్టారెంట్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.. పాడైపోయిన చికెన్, బొద్దింకలు దర్శనం
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
అయితే పెరిగిన ఇంటర్చేంజ్ ఫీజులను కస్టమర్లకు బదిలీ చేయాలా వద్దా అనే దానిపై బ్యాంకులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ దీనిపై జరుగుతున్న చర్చలు చివరికి కస్టమర్లు ఆ భారాన్ని భరించాల్సి ఉంటుందని సూచిస్తున్నాయి. గత 10 సంవత్సరాలుగా ఇంటర్చేంజ్ ఫీజులు సవరించబడినప్పుడల్లా, బ్యాంకులు కస్టమర్లకు బదిలీ చేశాయి. ఇప్పుడు కూడా బ్యాంకులు కస్టమర్లకు ఫీజులను పెంచే ఛాన్స్ ఉందని సీనియర్ బ్యాంక్ అధికారి వెల్లడించారు.
Also Read:Nitish Kumar Reddy Marriage: బ్రో లవ్ మ్యారేజా.. నితీశ్ రెడ్డి సమాధానం ఇదే (వీడియో)!
ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజు అనేది ఏటీఎం సేవలను ఉపయోగించడానికి ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు చెల్లించే ఛార్జీ. ఈ రుసుము సాధారణంగా లావాదేవీలో ఒక శాతంగా ఉంటుంది. ఆర్బీఐ గతంలో జూన్ 2021లో ఇంటర్చేంజ్ ఫీజులను సవరించింది. నగదు ఉపసంహరణ వంటి ఆర్థిక లావాదేవీలకు ఇంటర్ఛేంజ్ ఫీజును రూ.17 నుంచి రూ.19కి పెంచారు. బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి ఆర్థికేతర లావాదేవీలకు రూ.6 నుంచి రూ.7కి పెంచారు. ప్రస్తుతం మెట్రో ప్రాంతాల్లోని ఒక బ్యాంకు కస్టమర్ ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు ఐదు, మెట్రోయేతర ప్రాంతాలలో మూడు ఫ్రీ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.
Also Read:Bollywood : ఖాన్స్ను టార్గెట్ చేస్తోన్న తమిళ స్టార్ డైరెక్టర్
ఇంటర్చేంజ్ ఫీజుల పెంపును అనుమతించే నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మార్చి 13న బ్యాంకులు, ఇతర వాటాదారులకు తెలియజేసిందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఫీజులతో కార్యకలాపాలను నిర్వహించడం ఆర్థికంగా కష్టంగా ఉందని భావిస్తున్న వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్ల అభ్యర్థనల మేరకు ఇంటర్చేంజ్ ఫీజును పెంచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!