Rayapati Sailaja: వేధింపులకు గురైనప్పుడు 112, 181కు కాల్ చేయండి.. ధైర్యంగా ఫిర్యాదు చేయండి!
- మహిళల సంక్షేమం, భద్రత, హక్కులపై అవగాహన కార్యక్రమం
- వేధింపులకు గురైనప్పుడు 112, 181కు కాల్ చేయండి
- ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి
- లైంగిక వేధింపుల నిరోధక చట్టాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s Safety Awareness program in AP: మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను, చట్టాల సమాచారాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చాలని, ప్రతివారం విద్యార్థినిలకు వీటిపై తరగతులు నిర్వహించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ సహకారంతో రాజమండ్రిలో జరిగిన మహిళల సంక్షేమం, భద్రత, హక్కులపై జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమానికి డాక్టర్ శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాయపాటి శైలజ మీడియాతో మాట్లాడుతూ… ‘మహిళల భద్రత, సంక్షేమంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాయలసీమ, కాకినాడ జిల్లాల అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విద్యార్థినులు, మహిళలు అనేక రకాల వేధింపులు ఎదుర్కొంటున్నారు. అందరూ ధైర్యంగా ముందుకు వచ్చి వాటిపై ఫిర్యాదు చేయాలి. మహిళల భద్రత కోసం శక్తి యాప్తో పాటు 112, 181 కాల్ సెంటర్లు ఉన్నాయి. ఎలాంటి సమస్యనైనా 181 నంబర్కు కాల్ చేసి చెప్పవచ్చు. వన్ స్టాప్ సెంటర్స్ ద్వారా మహిళలకు వసతి కల్పించడంతో పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తాం’ అని తెలిపారు.
Also Read
- Vivo S60 సిరీస్ లాంచ్.. 7200mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో..
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్లు ఇవే..
- Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
- Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
Also Read: Asia Cup 2025: అభిమానులకు కీలక అప్డేట్.. ఆసియా కప్ షెడ్యూల్లో మార్పు!
‘ఫోన్లను దుర్వినియోగం చేయడంవల్ల మన సమస్యలకు మనమే కారణమవుతున్నాం. ఫోన్ వినియోగ విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలి. సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ స్నేహాల వల్ల ప్రేమలు, పెళ్లిళ్లు పెరిగాయి. వీటివల్ల మహిళలు బాధితులుగా మారుతున్నారు. కొందరు మార్నింగ్ ఫోటోలు పంపి వేధింపులకు పాల్పడుతున్నారు, వీటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతేకాని ఆత్మహత్య వంటి ఆలోచన చేయవద్దు. చిన్నారులపై లైంగిక వేధింపుల నివారణకు ఉద్దేశించిన పోక్సో చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పది మంది మహిళా ఉద్యోగులు గల ప్రతి సంస్థ అంతర్గత ఫిర్యాదు కమిటీలను (ఐసీసీ) ఏర్పాటు చేయాలి. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు వివాహానికి పూర్వమే కౌన్సిలింగ్ నిర్వహించే సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. మహిళా కమిషన్ కొన్ని కేసులను సుమోటోగా తీసుకుంటోంది. వ్యభిచారానికి అంగీకరించలేదని భార్యను హత్య చేసిన కేసును మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది’ అని రాయపాటి శైలజ చెప్పారు.
తాజావార్తలు
-
Vivo S60 సిరీస్ లాంచ్.. 7200mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో..
-
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్లు ఇవే..
-
Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
-
Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..