Land Grab : రాయదుర్గం లో భారీ భూ దందా…
- ప్రైవేట్ వ్యక్తులకు సహకరించి నకిలీ పత్రాలు సృష్టించిన సబ్ రిజిస్ట్రార్
- కాజేసిన స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్.. హై రైజ్డ్ బిల్డింగ్ నిర్మాణానికి ఏర్పాట్లు చేసిన గ్రీక్ బిల్డర్స్
- రెవెన్యూ అధికారుల చొరవతో వెలుగులోకి వచ్చిన అధికారి భూ దందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Land Grab : రాయదుర్గం లో భారీ భూ దందా వెలుగులోకి వచ్చింది. 1500 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రార్ కొట్టేసిన ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ గ్రీక్ బిల్డర్స్ తో కలిసి.. ప్రభుత్వ ఆస్తిని కాజేశాడు సదరు అధికారి.. ప్రైవేట్ వ్యక్తులకు సహకరించి సబ్ రిజిస్ట్రార్ నకిలీ పత్రాలు సృష్టించారు. కాజేసిన స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్, హై రైజ్డ్ బిల్డింగ్ నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది గ్రీక్ బిల్డర్స్. రెవెన్యూ అధికారుల చొరవతో అధికారి భూ దందా వెలుగులోకి వచ్చింది. దీంతో సైబరాబాద్ ఎకనామిక్స్ వింగ్ అధికారులకు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. 12.09 ఎకరాల లెదర్ పార్క్ స్థలాన్ని కాజేసేందుకు కుట్ర పన్నారు. రాయదుర్గం పరిధిలోని లేదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ కి చెందిన 12.09 ఎకరాల భూమి ఆక్రమణ గురైంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన రిజిస్ట్రేషన్ అధికారులు కబ్జాకోరులకు సహకరించారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి 600 కోట్ల రూపాయల విలువైన భూమి పెట్టారు. రెవెన్యూ అధికారులు ఫిర్యాదుతో.. కబ్జా కి పాల్పడిన ఆరుగురు వ్యక్తులతోపాటు.. రంగారెడ్డి జిల్లా బాలానగర్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గురుసాయిరాజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. కబ్జాకి ప్రయత్నించిన మహ్మద్ అబ్దుల్ రజాక్, మహ్మద్ అబ్దుల్ అదిల్, సయేదా కౌజర్, అఫ్షా సారా ను సైతం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Israel Iran: ఇరాన్పై ఇజ్రాయిల్ దాడి.. 1981 ఇరాక్పై దాడితో పోలిక..
Also Read
- CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
- Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
- India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
- Ravi Shastri: "చాలా పెద్ద తప్పు చేస్తున్నారు".. టీమిండియా మేనేజ్మెంట్పై రవిశాస్త్రి ఫైర్!
ఈ సందర్భంగా NTVతో EOW DCP ప్రసాద్ మాట్లాడుతూ.. రాయదుర్గం పరిధిలోని 600 కోట్ల విలువైన 12.09 ఎకరాల్లో గృహ, వాణిజ్య సముదాయ నిర్మాణం చేపట్టేందుకు గ్రీక్ బిల్డర్స్ ఎల్ఎల్పీ నవీన్కుమార్ గోయల్తో మహ్మద్ అబ్దుల్ రజాక్, మహ్మద్ అబ్దుల్ అదిల్, సయేదా కౌజర్, అఫ్షా సారా ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 39 బహుళ అంతస్తుల నిర్మాణం అభివృద్ధి చేసేందుకు 30:70 రేషియో లో ఒప్పందం జరిగిందని, నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న ఈ భూములను కొట్టేసేందుకు పెద్ద పథకమే వేశారన్నారు. నకిలీ పత్రాలు సృష్టించారని, ఫైజుల్లా వారసులుగా మహ్మద్ అబ్దుల్ అదిల్, సయేదా కౌజర్, అఫ్షా సారా పేరిట ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ రికార్డులను తారుమారు చేశారన్నారు. నకిలీ పత్రాలతో ఫైజుల్లా వారుసులు, గ్రీక్ బిల్డర్స్ ఎల్ఎల్పీ మధ్య ‘డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ గురుసాయిరాజ్ సహకరించాడని, ఫేక్ డాక్యుమెంట్లు అని తెలిసినా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడన్నారు. రాయదుర్గం 1,4,5,20 సర్వే నంబర్లలోని ఈ ప్రభుత్వ భూములు తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్నాయని, 5.16 ఎకరాల్లో యూనిటీ మాల్ నిర్మాణం చేపట్టేందుకు టీఎస్ఎల్ఐపీసీవోతో తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లీజు అగ్రిమెంట్ చేసుకుందన్నారు. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన విషయం గుర్తించిన శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి సైబరాబాద్ EOW లో ఫిర్యాదు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామని, మరికొందరు పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు.
Satish Kumar Reddy: చెల్లి కోసం జగన్ సొంత ఆస్తుల్లో కూడా వాటా ఇచ్చారు..
తాజావార్తలు
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
-
iQOO Z11i: ఐకూ Z11i విడుదల.. 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon 4 Gen 2
-
Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
-
India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!