Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Rayadurg Land Grab Assistant Sub Registrar Fraud

Land Grab : రాయదుర్గం లో భారీ భూ దందా…

Published Date :October 26, 2024 , 4:52 pm
By Gogikar Sai Krishna
  • ప్రైవేట్ వ్యక్తులకు సహకరించి నకిలీ పత్రాలు సృష్టించిన సబ్ రిజిస్ట్రార్
  • కాజేసిన స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్.. హై రైజ్డ్ బిల్డింగ్ నిర్మాణానికి ఏర్పాట్లు చేసిన గ్రీక్ బిల్డర్స్
  • రెవెన్యూ అధికారుల చొరవతో వెలుగులోకి వచ్చిన అధికారి భూ దందా
Land Grab : రాయదుర్గం లో భారీ భూ దందా…
  • Follow Us :
  • google news
  • dailyhunt

Land Grab : రాయదుర్గం లో భారీ భూ దందా వెలుగులోకి వచ్చింది. 1500 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రార్ కొట్టేసిన ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ గ్రీక్ బిల్డర్స్ తో కలిసి.. ప్రభుత్వ ఆస్తిని కాజేశాడు సదరు అధికారి.. ప్రైవేట్ వ్యక్తులకు సహకరించి సబ్ రిజిస్ట్రార్ నకిలీ పత్రాలు సృష్టించారు. కాజేసిన స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్, హై రైజ్డ్ బిల్డింగ్ నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది గ్రీక్ బిల్డర్స్. రెవెన్యూ అధికారుల చొరవతో అధికారి భూ దందా వెలుగులోకి వచ్చింది. దీంతో సైబరాబాద్ ఎకనామిక్స్ వింగ్ అధికారులకు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. 12.09 ఎకరాల లెదర్ పార్క్ స్థలాన్ని కాజేసేందుకు కుట్ర పన్నారు. రాయదుర్గం పరిధిలోని లేదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ కి చెందిన 12.09 ఎకరాల భూమి ఆక్రమణ గురైంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన రిజిస్ట్రేషన్ అధికారులు కబ్జాకోరులకు సహకరించారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి 600 కోట్ల రూపాయల విలువైన భూమి పెట్టారు. రెవెన్యూ అధికారులు ఫిర్యాదుతో.. కబ్జా కి పాల్పడిన ఆరుగురు వ్యక్తులతోపాటు.. రంగారెడ్డి జిల్లా బాలానగర్‌ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్ గురుసాయిరాజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. కబ్జాకి ప్రయత్నించిన మహ్మద్‌ అబ్దుల్‌ రజాక్, మహ్మద్‌ అబ్దుల్‌ అదిల్, సయేదా కౌజర్, అఫ్షా సారా ను సైతం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Israel Iran: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి.. 1981 ఇరాక్‌పై దాడితో పోలిక..

ఈ సందర్భంగా NTVతో EOW DCP ప్రసాద్ మాట్లాడుతూ.. రాయదుర్గం పరిధిలోని 600 కోట్ల విలువైన 12.09 ఎకరాల్లో గృహ, వాణిజ్య సముదాయ నిర్మాణం చేపట్టేందుకు గ్రీక్‌ బిల్డర్స్‌ ఎల్‌ఎల్‌పీ నవీన్‌కుమార్‌ గోయల్‌తో మహ్మద్‌ అబ్దుల్‌ రజాక్, మహ్మద్‌ అబ్దుల్‌ అదిల్, సయేదా కౌజర్, అఫ్షా సారా ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 39 బహుళ అంతస్తుల నిర్మాణం అభివృద్ధి చేసేందుకు 30:70 రేషియో లో ఒప్పందం జరిగిందని, నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న ఈ భూములను కొట్టేసేందుకు పెద్ద పథకమే వేశారన్నారు. నకిలీ పత్రాలు సృష్టించారని, ఫైజుల్లా వారసులుగా మహ్మద్‌ అబ్దుల్‌ అదిల్, సయేదా కౌజర్, అఫ్షా సారా పేరిట ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ రికార్డులను తారుమారు చేశారన్నారు. నకిలీ పత్రాలతో ఫైజుల్లా వారుసులు, గ్రీక్‌ బిల్డర్స్‌ ఎల్‌ఎల్‌పీ మధ్య ‘డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కమ్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ గురుసాయిరాజ్‌ సహకరించాడని, ఫేక్ డాక్యుమెంట్లు అని తెలిసినా రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చాడన్నారు. రాయదుర్గం 1,4,5,20 సర్వే నంబర్లలోని ఈ ప్రభుత్వ భూములు తెలంగాణ లెదర్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ ఆధీనంలో ఉన్నాయని, 5.16 ఎకరాల్లో యూనిటీ మాల్‌ నిర్మాణం చేపట్టేందుకు టీఎస్‌ఎల్‌ఐపీసీవోతో తెలంగాణ స్టేట్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లీజు అగ్రిమెంట్‌ చేసుకుందన్నారు. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్‌ చేసిన విషయం గుర్తించిన శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వెంకారెడ్డి సైబరాబాద్ EOW లో ఫిర్యాదు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేశామని, మరికొందరు పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు.

Satish Kumar Reddy: చెల్లి కోసం జగన్ సొంత ఆస్తుల్లో కూడా వాటా ఇచ్చారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • criminal case
  • EOW Investigation
  • fake documents
  • Government Land
  • Greek Builders

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions