Rayachoti Student Died In Ukraine: ఎంబీబీఎస్ చేసేందుకు వెళ్లి గుండెపోటుతో మరణించిన విద్యార్థి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rayachoti Student Died In Ukraine: ఎన్నో ఆశలతో కొడుకును ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించారు ఆ తల్లిదండ్రులు. ఆస్తులు అమ్మి, అప్పులు చేసి కొడుకును డాక్టర్ చేయాలని ఆశపడ్డారు. వాళ్ల ఆశలన్నీ అతనిపైనే పెట్టుకొని బతుకుతున్నారు. కొన్ని రోజుల్లో కొడుకు డాక్టర్ అయి తీరివస్తాడు కష్టాలు తీరతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతలోనే వారికి తమ కొడుకు ఇక లేడు అనే చేదు వార్త తెలిసింది. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వారి బాధ చూసి చుట్టుపక్కల వారు కూడా ఈ కష్టం ఎవరికీ రాకూడదంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. చేతికొచ్చిన కొడుకు తోడు లేకుండా పోయాడు, ఇక ఎప్పటికీ రాడు అనే విషయం జీర్ణించుకోవడం ఎవరికైనా కష్టమే అని విచారణం వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్ చేసేందుకు ఉక్రెయిన్ వెళ్లిన రాయచోటి విద్యార్థి గుండెపోటుతో మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: Andrapradesh : ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఐదుగురు మృతి..
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
వివరాళ్లోకి వెళ్తే.. రాయచోటి పూజారి బండ వీధికి చెందిన దంపతులు రావూరి శ్రీనివాసులు, భాగ్యలక్ష్మి తమ కొడుకు రావూరి గిరీష్ ను ఎంబీబీఎస్ చదివించాలనుకున్నారు. కొడుకు భవిష్యత్తే ముఖ్యమనుకున్న వారు ఆస్తులు అమ్మి, అప్పులు చేసి కొడుకును చదువు కోసం ఉక్రెయిన్ పంపించారు. గత నాలుగేళ్లుగా గిరీష్ ఉక్రెయిన్ లోనే ఎంబీబీఎస్ చేస్తున్నాడు. అయితే ఈ నెల 20వ తేదీన గిరీష్ స్వదేశానికి రావాల్సి ఉంది. ఇంతలో అతను గుండె పోటులో మరణించాడు. ఈ వార్త తెలియడంతో ఆ తల్లిదండ్రులు కుప్ప కూలిపోయారు. చేతికి అందొచ్చిన కొడుకు ఇక లేడని ఊహించుకోవడం కూడా వారికి కష్టంగా ఉంది. గుండెలు పగిలేలా ఏడుస్తున్న ఆ తల్లిదండ్రుల రోదనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కనీసం తమ కొడుకును కడసారి చూసేందుకైనా మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు కుటుంబ సభ్యులు.
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!