Ravindar Singh : అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధాన్యం సేకరణ చాలా వేగంగా జరుగుతుందని తెలిపారు పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 7,152 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ చెప్పారని, ఇప్పటివరకు 6000 కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. గత సీజన్ లో 4 లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. ఈ సంవత్సరం ఇవాళ్టి వరకు 10 లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఆయన పేర్కొన్నారు. అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభం అయిందని, వరి ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లో డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. రైతులు ఇబ్బంది పడితే నాకు ఫోన్ చేశారు నేను నిన్న జనగామ జిల్లా కూనూర్ కు వెళ్ళాను కొనుగోలు కేంద్రం వద్ద కొంత ఇబ్బంది వచ్చిందని ఆయన వెల్లడించారు.
Also Read : MP Revenge Story: పదేళ్ల నాటి పగ.. పట్టపగలే ఆరుగురిని కాల్చి చంపారు
Also Read
అక్కడ ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని నేను అక్కడకు స్వయంగా వెళ్లి కొనుగోలు చేసి లారీ ధాన్యం ఎక్కించాను అక్కడికక్కడే రశీదు ఇవ్వడం జరిగిందని, తేమ శాతం 17,18 కంటే ఎక్కువగా రావడం లేదు 17 కంటే ఒక్క శాతం ఎక్కువ వచ్చిన కొనుగోలు చేయాలని చెప్పారన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత మాదేనని, ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి కూడా స్పష్టంగా చెప్పారన్నారు. ఎంత ధాన్యం వచ్చిన ధాన్యం పూర్తి అయ్యే వరకు కొనుగోలు చేస్తామని, గన్ని బ్యాగులు సరిపడా ఉన్నాయి…. టార్పాలిన్ కవర్లు కూడా ఇప్పటికే అందుబాటులో ఉంచామన్నారు. అకాల వర్షాలతో కొంత నష్టం వచ్చింది బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Minister KTR : బీఆర్ఎస్ అంటే భారత్ రైతు సమితి
తాజావార్తలు
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
-
Sharvari Wagh: షూటింగ్లో అలియాను చూసి ఎన్నో నేర్చుకున్నా: శార్వరీ
-
Ruturaj Gaikwad: ముగిసిన సీఎస్కే ప్రయాణం.. ధోనీ రిటైర్మెంట్పై CSK కెప్టెన్ సంచలన ప్రకటన..
-
US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
-
Dragon: ‘డ్రాగన్’లో..తారక్ పాత్రపై ప్రశాంత్ నీల్ బిగ్ క్లారిటీ..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!