MP Revenge Story: పదేళ్ల నాటి పగ.. పట్టపగలే ఆరుగురిని కాల్చి చంపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Six of family gunned down in Madhya Pradesh revenge killing: మధ్యప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం పట్టపగలే.. కొందరు దుండగులు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తుల్ని కాల్చి చంపారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురిని ఆసుపత్రిని తరలిస్తుండగా తుదిశ్వాస వదిలారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పదేళ్ల క్రితం తమ కుటుంబసభ్యుల్ని చంపినందుకు ప్రతీకారంగా.. ఆ దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Prachhaya Lunar Eclipse Live: ప్రచ్ఛాయ చంద్రగ్రహణం.. ఏంచేయాలో తెలుసా?
Also Read
- Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Vijayawada Road Accident: ఇద్దరి ప్రాణాలు బలిగొన్న కొబ్బరి బొండం
- Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
మొరేనాకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపా గ్రామంలో.. ధీర్ సింగ్, గజేంద్ర సింగ్ అనే రెండు కుటుంబాలు ఉన్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య ఆస్తుల విషయంలో ఎప్పటినుంచో శతృత్వం ఉంది. ఇందులో భాగంగానే.. 2013లో ధీర్ సింగ్ కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల్ని గజేంద్ర సింగ్ కుటుంబీకులు చంపారు. అప్పటి నుంచి ఆ రెండు ఫ్యామిలీల మధ్య శతృత్వం తారాస్థాయికి చేరుకుంది. గజేంద్ర సింగ్ కుటుంబంపై పగ పెంచుకున్న ధీర్ సింగ్ కుటుంబీకులు.. ప్రతీకారం తీర్చుకోవడం కోసం సరైన సమయం కోసం వేచి చూశారు. ఈ కేసు విచారణ కొన్ని సంవత్సరాల వరకు కొనసాగింది. చివరికి గజేంద్ర సింగ్ ఫ్యామిలీ మెంబర్స్కు జైలుశిక్ష పడటంతో.. వాళ్లు నాలుగైదేళ్లు జైలుశిక్ష అనుభవించారు. ఈ శుక్రవారమే వాళ్లు జైలు నుంచి విడుదల అయ్యారు.
Minister KTR : బీఆర్ఎస్ అంటే భారత్ రైతు సమితి
ఈ విషయం తెలుసుకున్న ధీర్ సింగ్ కుటుంబీకులు.. ఇదే సరైన సమయమని భావించి, తుపాకులు తీసుకొని వారిపై కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం ఉదయం 9:30 – 10:00 గంటల మధ్య వాళ్లు కాల్పులు జరిపారు. వీరిని అడ్డుకోవడానికి మహిళలు చెక్క కర్రల్ని విసిరారు. అయితే.. వాళ్లు వెనక్కు తగ్గకుండా కాల్పులు జరపగా, ఆరుగురు హతమయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కాల్పులకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా ఐదుగురి కోసం గాలిస్తున్నారు. పాత కక్షల వల్లే ఈ కాల్పులు జరిగినట్టు తేలిందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Prabhas Record: ప్రభాస్ సరికొత్త రికార్డ్.. రెబల్ స్టార్ కెరీర్లోనే..!
-
IBPS SO Recruitment 2026: 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. నెలకు రూ.85,000కు పైగా జీతం
-
Hrithik Roshan Divorce: హృతిక్ నుంచి 400 కోట్ల భరణం.. వైరల్ వార్తపై షాకింగ్ ట్విస్ట్!
-
Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
-
IND vs ENG 2nd T20: ప్లేయింగ్ ఎలెవన్లో సంజు, వైభవ్.. అసలు వేటు మనోడి పైనే?
ట్రెండింగ్
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!