MP Revenge Story: పదేళ్ల నాటి పగ.. పట్టపగలే ఆరుగురిని కాల్చి చంపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Six of family gunned down in Madhya Pradesh revenge killing: మధ్యప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం పట్టపగలే.. కొందరు దుండగులు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తుల్ని కాల్చి చంపారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురిని ఆసుపత్రిని తరలిస్తుండగా తుదిశ్వాస వదిలారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పదేళ్ల క్రితం తమ కుటుంబసభ్యుల్ని చంపినందుకు ప్రతీకారంగా.. ఆ దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Prachhaya Lunar Eclipse Live: ప్రచ్ఛాయ చంద్రగ్రహణం.. ఏంచేయాలో తెలుసా?
Also Read
- Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
మొరేనాకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపా గ్రామంలో.. ధీర్ సింగ్, గజేంద్ర సింగ్ అనే రెండు కుటుంబాలు ఉన్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య ఆస్తుల విషయంలో ఎప్పటినుంచో శతృత్వం ఉంది. ఇందులో భాగంగానే.. 2013లో ధీర్ సింగ్ కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల్ని గజేంద్ర సింగ్ కుటుంబీకులు చంపారు. అప్పటి నుంచి ఆ రెండు ఫ్యామిలీల మధ్య శతృత్వం తారాస్థాయికి చేరుకుంది. గజేంద్ర సింగ్ కుటుంబంపై పగ పెంచుకున్న ధీర్ సింగ్ కుటుంబీకులు.. ప్రతీకారం తీర్చుకోవడం కోసం సరైన సమయం కోసం వేచి చూశారు. ఈ కేసు విచారణ కొన్ని సంవత్సరాల వరకు కొనసాగింది. చివరికి గజేంద్ర సింగ్ ఫ్యామిలీ మెంబర్స్కు జైలుశిక్ష పడటంతో.. వాళ్లు నాలుగైదేళ్లు జైలుశిక్ష అనుభవించారు. ఈ శుక్రవారమే వాళ్లు జైలు నుంచి విడుదల అయ్యారు.
Minister KTR : బీఆర్ఎస్ అంటే భారత్ రైతు సమితి
ఈ విషయం తెలుసుకున్న ధీర్ సింగ్ కుటుంబీకులు.. ఇదే సరైన సమయమని భావించి, తుపాకులు తీసుకొని వారిపై కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం ఉదయం 9:30 – 10:00 గంటల మధ్య వాళ్లు కాల్పులు జరిపారు. వీరిని అడ్డుకోవడానికి మహిళలు చెక్క కర్రల్ని విసిరారు. అయితే.. వాళ్లు వెనక్కు తగ్గకుండా కాల్పులు జరపగా, ఆరుగురు హతమయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కాల్పులకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా ఐదుగురి కోసం గాలిస్తున్నారు. పాత కక్షల వల్లే ఈ కాల్పులు జరిగినట్టు తేలిందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!