Ration Card Verification : జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న రేషన్ కార్డుల వెరిఫికేషన్..
- GHMC పరిధిలో కొనసాగుతున్న రేషన్ కార్డుల వెరిఫికేషన్
- ఇంటికి వెళ్లి ఆదాయం, ఆస్తులు వివరాలు వెరిఫై చేస్తున్న అధికారులు
- GHMC, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారుల సమన్వయంతో కొనసాగుతున్న ఫీల్డ్ వెరిఫికేషన్
Ration Card Verification : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇటీవల కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మరింత దృష్టిలో పెట్టుకుని, జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు రంగంలోకి దిగారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి నేతృత్వంలో 150 డివిజన్లలో దరఖాస్తుదారుల అర్హతల పరిశీలన ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో రేషన్ కార్డుల వెరిఫికేషన్ కొనసాగుతోంది. కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారి ఇంటికి వెళ్లి ఆదాయం, ఆస్తులు వివరాలు వెరిఫై చేస్తున్నారు అధికారులు. GHMC, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారుల సమన్వయంతో ఫీల్డ్ వెరిఫికేషన్ కొనసాగుతోంది. రెండు లక్షల లోపు ఆదాయం ఉండి, బిలో పావర్టీ లైన్కు దిగువన ఉన్న వారు రేషన్ కార్డు అర్హులు అంటున్నారు అధికారులు. సొంత ఇండ్లు, ఆస్తులు ఉండి కూడా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారి అప్లికేషన్ డిస్ క్వాలిఫై చేస్తున్నామని అధికారులు అంటున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు కోసం 83 వేల మంది అప్లై చేసుకున్నట్లు, ఈ నెల 20 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 24వ తేదీ నాటికి అర్హుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాలని, 25వ తేదీకి ఆయా జిల్లా కలెక్టర్లకు నివేదికను అందజేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారుల వివరాలను ప్రభుత్వం వద్ద ఉన్న డేటాతో సరిచూసి, చివరగా ఈ నెల 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read
- Raashii Khanna: పోలీస్ ఆఫీసర్గా రాశీ ఖన్నా.. ‘లుఖ్కే’ వెబ్ సిరీస్ క్రేజీ అప్డేట్!
- Kollywood: తమిళనాట నిలిచిపోయిన షూటింగ్స్.. నిర్మాతల సంచలన నిర్ణయం!
- CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
- Batchmates Web Series :మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి.. ‘బ్యాచ్మేట్స్’ సిరీస్ రివ్యూ
Fake Notes: కలవరపెడుతున్న రూ. 200 ఫేక్ నోట్లు.. మీ దగ్గర ఉన్నాయా? ఇలా గుర్తించండి!
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర సర్వేలో, జీహెచ్ఎంసీ పరిధిలో 22 లక్షల కుటుంబాల వివరాలను సేకరించింది. ఈ సర్వే అనంతరం కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. ఇందులో 83,285 మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు.
ఇంటింటి సర్వేలో కూడా అనేక మంది కొత్త రేషన్ కార్డుల కోసం తమ వివరాలను నమోదు చేసుకున్నారు. గతంలో కొత్త రేషన్ కార్డుల జారీ లేకపోవడం, కార్డుల్లో మార్పులు చేసుకునే అవకాశాలు లేకపోవడంతో వేలాది మంది ప్రజలు కొత్త కార్డుల కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. జీహెచ్ఎంసీ అధికారులు ప్రాథమికంగా అర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారుల వివరాలను పరిశీలిస్తున్నారు. నివేదిక తయారు చేసి, ఈ నెల 26వ తేదీ నాటికి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమయ్యేలా కృషి చేస్తున్నారు.
ఈ కొత్త ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని అనేక మంది అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తాయి. ఇది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయడంలో సహాయపడుతుంది.
Bharat Mobility Expo : ఏళ్ల నిరీక్షణకు తెర.. హ్యుందాయ్ క్రెటా ఈవీ వచ్చేసిందోచ్..
తాజావార్తలు
-
Census 2026 Scam Alert: జాగ్రత్త! జనాభా లెక్కల పేరుతో మోసం.. ఈ వివరాలను పంచుకోవద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి
-
Raashii Khanna: పోలీస్ ఆఫీసర్గా రాశీ ఖన్నా.. ‘లుఖ్కే’ వెబ్ సిరీస్ క్రేజీ అప్డేట్!
-
Kollywood: తమిళనాట నిలిచిపోయిన షూటింగ్స్.. నిర్మాతల సంచలన నిర్ణయం!
-
CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
-
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!