Virat Kohli: విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉంటే.. భారత్ మరో లెవల్లో ఉండేది: రషీద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashid Latif Says Team India are not well prepared for ICC ODI World Cup 2023: 2022 వరకు మూడు ఫార్మాట్లలో టీమిండియాకు కెప్టెన్గా విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం బ్యాటర్గా కొనసాగుతున్నాడు. కోహ్లీ స్వయంగా టీ20 ఫార్మాట్ నాయకత్వం నుంచి తప్పుకున్నా.. బీసీసీఐ పెద్దలు వన్డే, టెస్ట్ కెప్టెన్సీ నుంచి తొలగేలా చేశారు. కోహ్లీ నుంచి పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ ఇప్పుడు మూడు ఫార్మాట్లలో సారథిగా ఉన్నాడు. ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టును ఐదుసార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్పై బీసీసీఐ ఎంతో నమ్మకం పెట్టుకుంది. అయితే ఆ అంచనాలను రోహిత్ అందుకోలేకపోయాడు.
సారథిగా రోహిత్ శర్మ ద్వైపాక్షిక సిరీస్ల్లో అదరగొడుతున్నా.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్ను ఛాంపియన్గా నిలపలేకపోతున్నాడు. రోహిత్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ సెమీస్లోనే ఇంటిదారి పట్టింది. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లోనూ భారత్ ఓడిపోయింది. కెప్టెన్గా విరాట్ కోహ్లీ కూడా ఐసీసీ టోర్నీల్లో భారత్ను విజేతగా నిలపలేకపోయాడు. భారత్ చివరగా 2013లో ఐసీసీ ట్రోఫీ నెగ్గింది. మరో 45 రోజుల్లో వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభంకానున్న నేపథ్యంలో భారత్ గురించి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో జరిగే మెగా టోర్నీకి భారత్ 100 శాతం సన్నద్ధం కాలేదన్నాడు. కోహ్లీని కెప్టెన్గా కొనసాగించి ఉంటే.. భారత్ మరో లెవల్లో ఉండేదని అభిప్రాయపడ్డాడు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
Also Read: Apple USB-C Port: యాపిల్ కీలక నిర్ణయం.. ఐఫోన్ 14 మోడళ్లకు యూఎస్బీ టైప్ సీ పోర్ట్!
‘మిడిల్, లోయర్ బ్యాటింగ్ ఆర్డర్లో భారత్ యాజమాన్యం తరచూ మార్పులు చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. చాలా మంది ఆటగాళ్లతో ప్రయోగాలు చేసింది. 4 నుంచి 7 స్థానాలలో కొత్త ఆటగాళ్లను స్థిరంగా ఒక స్థానంలో ఆడించలేదు. ఈ కారణంగానే వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాల నుంచి కోలుకుని జట్టులోకి వస్తున్నారు. ఇది రిస్కే అయినా ప్రపంచకప్లో భారత్ సీనియర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. కోహ్లీని కెప్టెన్గా కొనసాగించి ఉంటే.. వన్డే ప్రపంచకప్కు భారత్ 100 శాతం సిద్ధంగా ఉండేది’ అని రషీద్ లతీఫ్ అన్నాడు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?