TS Crime News: మొగుడే యముడు.. రెండో భార్య అందుకు ఒప్పుకోలేదని..!
- కట్టుకున్న మొగుడే ఆమె పాలిట కాలయముడయ్యాడు
- ఫెన్సింగ్ రాయితో రెండో భార్య ఛాతీపై మోదాడు
- నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కట్టుకున్న మొగుడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కలిసి బతుకుదాం అని నమ్మించి.. అత్యంత దారుణంగా కడతేర్చాడు. చున్నీతో ఉరి వేశాడు కానీ అప్పటికీ చావలేదని.. ఫెన్సింగ్ రాయితో ఛాతీపై మోదాడు. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. భార్యను అత్యంత దారుణంగా చంపేసిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వెంకన్నగూడలో జరిగింది.
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వానరాశి జంగయ్య. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని వెంకన్నగూడ స్వస్థలం. కానీ అతడు చాలా కాలం నుంచి హైదరాబాద్లో కార్ డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మరో విషయం ఏంటంటే జంగయ్యకు ఇద్దరు భార్యలు. ప్రస్తుతం మొదటి భార్యతోనే ఉంటున్నాడు. కానీ రెండో భార్య రజిత మాత్రం విడిగా ఉంటోంది. రజితతో చాలా రోజుల క్రితం నుంచే జంగయ్యకు గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఆమె వేరుగా నివాసం ఉంటోంది. ఐతే జంగయ్య.. ఈ మధ్య కలిసి జీవిద్దాం అని చెప్పి తన ఊరు వెంకన్నగూడకు రప్పించాడు. పెద్దల సమక్షంలో ఇరువురు మాట్లాడుకున్నారు. అయినప్పటికీ రజిత.. జంగయ్యతో కలిసి ఉండేందుకు ఒప్పుకోలేదు. దీంతో అతను భార్యపై కక్ష పెంచుకున్నాడు.
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
Also Read: Crime News: కన్న తల్లినే దారుణంగా చంపేసిన కొడుకు.. కారణం తెలిస్తే బిత్తరపోవాల్సిందే!
ఇద్దరూ.. ఊరు నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఊరికి సమీపంలో ఇద్దరూ కలిసి మద్యం తాగారు. అనంతరం ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ సమయంలో కోపోద్రిక్తుడైన జంగయ్య.. రజిత మెడకు స్కార్ఫ్ బిగించి హత్య చేశాడు. అప్పుడు కూడా ఆమె కొన ఊపిరితో ఉండడంతో.. పక్కనే ఉన్న ఫెన్సింగ్ దిమ్మెను తీసుకుని ఆమె ఛాతీపై బలంగా మోదాడు. అప్పుడు రజిత ప్రాణాలు కోల్పోయింది. స్పాట్లోనే రెండో భార్య రజిత డెడ్ బాడీ ఫోటోలు తీసుకున్నాడు జంగయ్య. ఆ ఫోటోలను మొదటి భార్యకు పంపించాడు. అంతే కాదు ఆమెకు కాల్ చేసి.. ఇదిగో ఇలా చంపాను అని చెప్పాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. అతని ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు.. రజిత డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత జంగయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!