Ranchi: వెజ్ బిర్యానీకి బదులు నాన్వెజ్ బిర్యానీ వడ్డన.. చివరకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranchi: జార్ఖండ్లోని రాంచీలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. ఒక హోటల్ యజమాని తన రెస్టారెంట్లోనే కాల్పులకు గురై హత్య చేయబడ్డాడు. ఓ వ్యక్తి రెస్టారెంట్ లో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. పొరపాటున నాన్వెజ్ బిర్యానీ వడ్డించడంపై జరిగిన వివాదమే ఈ హత్యకు దారితీసినట్లు సమాచారం. కాంకే – పిథోరియా రోడ్డులో ఉన్న ‘చౌపాటీ’ అనే రెస్టారెంట్కు చెందిన యజమాని విజయ్ కుమార్ ను శనివారం అర్ధరాత్రి దుండగులు కాల్చి చంపారు. హత్య సమాచారం అందుకున్న వెంటనే రాంచీ రూరల్ ఎస్పీ ప్రవీణ్ పుష్కర్, కాంకే పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ హత్యకు గల కారణాలపై అనేక కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు రాంచీలోని ప్రధాన మార్గాల్లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. అలాగే సంఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు.
Revanth Reddy: గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు బ్రిటీషర్ల కంటే ప్రమాదం!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
పూర్తి వివరాల్లోకి వెళితే.. శనివారం అర్ధరాత్రి ఒక కారులో నలుగురు యువకులు సేఫ్ చౌపాటీ రెస్టారెంట్కు వచ్చారు. రెస్టారెంట్లోకి రాగానే వారు హోటల్ యజమాని విజయ్ కుమార్కు వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. అయితే, యజమాని పొరపాటున వారికి వెజ్ బిర్యానీకి బదులు నాన్వెజ్ బిర్యానీ వడ్డించారు. ఈ పొరపాటుకు ఆగ్రహించిన యువకులలో ఒకరు, తన నడుము నుంచి తుపాకీ తీసి హోటల్ యజమాని విజయ్ కుమార్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. హత్య జరిగిన వెంటనే నిందితులంతా కారులో పిథోరియా మీదుగా పారిపోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా భయాందోళనలకు గురైంది.
K Ramp: క రికార్డ్ బద్దలు కొట్టలేక పోయిన కె ర్యాంప్
స్థానికులు వెంటనే హోటల్ యజమాని విజయ్ కుమార్ను చికిత్స నిమిత్తం రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం, పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కేవలం బిర్యానీ ఆర్డర్ పొరపాటు కారణంగానే ఈ హత్య జరిగిందా..? లేక దీని వెనుక మరేదైనా పాత పగ..? లేదా వ్యక్తిగత వైరం ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!