Ramayana : రాజమౌళి రేంజ్ ప్రమోషన్స్తో ‘రామాయణం’.. ఫస్ట్ లుక్ రివీల్కు ముహూర్తం ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రాల్లో బాలీవుడ్ ‘రామాయణం’ ఒకటి. భారతీయ పురాణ ఇతిహాసం ‘రామాయణాన్ని’ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించేందుకు బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ సిద్ధమయ్యారు. సుమారు రూ. 4,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో (రెండు భాగాలకు కలిపి) రూపొందుతున్న ఈ చిత్రం, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్గా నిలవనుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడిగా కనిపిస్తుండగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంతోనే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. అలాగే
Also Read : AA22 : బన్నీకి విలన్గా రష్మిక.. ‘AA22’లో శ్రీవల్లి ఊహించని ట్విస్ట్!
Also Read
- UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
ఈ చిత్రంలో విలన్ పాత్ర అయిన రావణుడిగా కన్నడ సూపర్ స్టార్ యష్ (Yash) నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వీరితో పాటు హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే, దశరథుడిగా అరుణ్ గోవిల్ వంటి భారీ తారాగణం ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఆస్కార్ విన్నింగ్ కంపెనీ DNEG తో మేకర్స్ పని చేస్తున్నారు. అయితే ‘రామాయణం పార్ట్-1’ ఈ ఏడాది (2026) దీపావళి కానుకగా విడుదల కానుండగా.. ఈ సినిమా కోసం మేకర్స్ ఒక భారీ ప్రమోషనల్ ప్లాన్ సిద్ధం చేశారు. దర్శకధీరుడు రాజమౌళి తన సినిమా వారణాసి కోసం వంటి పుణ్యక్షేత్రాల్లో చేసే గ్రాండ్ ఈవెంట్స్ బాటలోనే, ఈ చిత్ర బృందం కూడా ముంబైలోని ఐకానిక్ గేట్వే ఆఫ్ ఇండియా వద్ద ఒక భారీ వేడుకకు ప్లాన్ చేస్తోంది. కాగా ఈ ఏడాది మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా ఈ ఈవెంట్ జరగబోతోంది.
ఈ వేడుకలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ సహా ప్రధాన తారాగణం అందరి ఫస్ట్ లుక్స్ను రివీల్ చేయనున్నారు. రాజమౌళి ఏ విధంగానైతే ‘RRR’ లేదా ‘బాహుబలి’ చిత్రాలకు నేషనల్ లెవల్లో హైప్ క్రియేట్ చేశారో, నితేష్ తివారీ టీమ్ కూడా అదే స్థాయిలో ప్రమోషన్స్ చేయబోతోందట. ఈ ఈవెంట్కు బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ దిగ్గజాలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మరి రాజమౌళి మార్కు ప్రమోషన్స్ ఈ చిత్రానికి ఏ స్థాయిలో మైలేజ్ ఇస్తాయో వేచి చూడాలి.
తాజావార్తలు
-
UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!