NTV Telugu Site icon

Ramakuppam: రామకుప్పం ఎస్ఐ ఫోన్ సంభాషణ వైరల్‌.. రౌడీషీట్ ఓపెన్ చేస్తానంటూ వార్నింగ్‌..

Ramakuppam Si

Ramakuppam Si

Ramakuppam: చిత్తూరు జిల్లా రామకుప్పం ఎస్ఐ ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది. కుప్పంలో 34 మంది టీడీపీ కార్యకర్తలపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు పోలీసులు. ఎన్‌కౌంటర్‌ చేస్తానంటూ టీడీపీ కార్యకర్తకు రామకుప్పం ఎస్ఐ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కుప్పంలో టీడీపీ కార్యకర్త గజేంద్రకు రామకుప్పం ఎస్ఐ కృష్ణ బెదిరించాడు. తాను పెట్టిన కేసు రిజిస్టర్ చేయమని అడిగినందుకు గజేంద్రపై బూతులతో విరుచుకుపడ్డాడు ఎస్ ఐ కృష్ణ. రౌడీ షీట్ ఓపెన్ చేస్తా.. దిక్కు ఉన్న చోట చెప్పుకో అంటూ బెదిరించాడు.

Read Also: GT vs MI: గుజరాత్ పరుగుల సునామీ.. ముంబై లక్ష్యం ఎంతంటే?

అంతేకాదు.. కాల్చిపడేస్తానా కొడకా.. ఎన్‌కౌంటర్‌ చేస్తానంటూ టీడీపీ కార్యకర్తపై బెదిరింపులకు దిగాడు.. అయితే, ఎస్సై సిఫారసు మేరకు నెల రోజుల్లోనే ఏకంగా 34 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారు సీఐ శ్రీధర్. మరో నలుగురిపై రౌడీషీట్లు పెట్టేందుకు సిద్దమయ్యాడు ఎస్ఐ. పోలీసుల వేధింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. మాపై కేసులు పెడుతున్నారు.. మరి మేం ఫిర్యాదు చేస్తే.. ఎందుకు కేసులు పెట్టడంలేదని ఎస్సైని ఫోన్‌లో ప్రశ్నించాడు బాధితుడు.. ఇలాగే వ్యవహరిస్తే పీఎస్‌ ఎదుట ధర్నా చేస్తామని పేర్కొన్నాడు.. దానిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎస్సై.. నోటికి వచ్చిన బూతులతో విరుచుకుపడ్డారు.. అయితే, ఆ సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్‌ మీడియాకు ఎక్కడంతో.. వైరల్‌గా మారిపోయింది. కాగా, గతంలో చౌడేపల్లి పోలీస్ స్టేషన్‌లో పిస్టల్ ఫైర్ చేసి ఎస్‌ఐ కృష్ణయ్య సస్పెండ్‌ అయినట్టుగా తెలుస్తోంది.