Kerala: కేరళ బీజేపీ అధ్యక్షుడిగా రాజీవ్ చంద్రశేఖర్ నియామకం..
- కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ చంద్రశేఖర్
- కేరళలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం- రాజీవ్
- ఈ బాధ్యతను స్వీకరించడం నాకు గర్వంగా ఉంది- రాజీవ్ చంద్రశేఖర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ కేంద్ర మంత్రి, టెక్నోక్రాట్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన రాజీవ్ చంద్రశేఖర్ సోమవారం కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేరళలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు ఉద్దేశించి మాట్లాడుతూ.. కేరళలో బీజేపీ నేతృత్వంలోని కూటమిని విజయపథంలో నడిపించే బాధ్యత తనకు అప్పగించారని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ బాధ్యతను స్వీకరించడం తనకు గర్వంగా ఉందని చెప్పారు. “నాకు ఈ బాధ్యతను అప్పగించినందుకు హైకమాండ్కు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మరియు ఇతరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం ప్రాణాలను త్యాగం చేసిన మాజీ రాష్ట్ర అధ్యక్షులు, కార్యకర్తలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. వారి అంకితభావం తన భవిష్యత్ ప్రయాణంలో మార్గదర్శక శక్తిగా పనిచేస్తుందని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Read Also: Yash : నన్ను పొగరుబోతు అని ముద్ర వేశారు.. యష్ ఎమోషనల్
కేరళలో బిజెపి ప్రభావం పెరుగుతున్న తరుణంలో ఇటీవలి లోక్సభ ఎన్నికలలో పార్టీ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. “బిజెపి ఎల్లప్పుడూ కార్మికుల పార్టీ, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది” అని ఆయన అన్నారు. మరోవైపు.. కేరళలోని వామపక్ష ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. అప్పులపై ఆధారపడి రాష్ట్రం ఎంతకాలం మనుగడ సాగించగలదని ప్రశ్నించారు. “రాష్ట్రం రుణాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది, విద్యార్థులు విదేశాలకు ఎందుకు వెళ్లాల్సి వస్తోంది, కొత్త చొరవలు ఎందుకు లేకపోవడం?” అనే అంశాలను ఆయన ప్రశ్నించారు. “కేరళ అభివృద్ధి స్తంభించిపోయింది. సవాళ్లు మిగిలి ఉన్నాయి, రాష్ట్రం స్థితిగతులు మార్చడమే బిజెపి లక్ష్యం. యువతకు అవకాశాలు లేకుండా ఉండటం అనేది పెద్ద సమస్య” అని రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. కేరళలో పెట్టుబడులు ఆకర్షించడానికి, ఉపాధి అవకాశాలు సృష్టించడానికి బిజెపి కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
చంద్రశేఖర్ 60 ఏళ్ల వయస్సులో రెండు దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఈ పదవి పొందారు. ఆయన ఎలక్ట్రానిక్స్, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, జల్ శక్తి శాఖల కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే.. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కర్ణాటక నుండి మూడు పర్యాయాలు ఎన్నికయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుండి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్.. కాంగ్రెస్ నేత శశి థరూర్ చేతిలో 16,077 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!