Rajat Patidar RCB: మూడేళ్ల ముందు అమ్ముడే పోలేదు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్!
- రజత్ పటీదార్కు ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు
- ఆటలో వచ్చిన అనూహ్య మార్పే కారణం
- 27 ఐపీఎల్ మ్యాచ్లలో 799 పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కెప్టెన్గా రజత్ పటీదార్ ఎంపికైన విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు నడిపించిన ఆర్సీబీకి.. పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడని రజత్ సారథిగా నియమితుడు కావడం అందిరినీ ఆశ్చర్యం కలిగించే విషయమే. అంతేకాదు మూడేళ్ల ముందు ఐపీఎల్లో అమ్ముడే కాని ఈ 31 ఏళ్ల ఆటగాడు.. ఆర్సీబీకి సారథి కావడం విశేషమే. అయితే ఈ అనూహ్య ఎదుగుదలకు కారణం రజత్ ఆటలో వచ్చిన అనూహ్య మార్పే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
2021లో రజత్ పటీదార్కు ఐపీఎల్ ఆడే అవకాశం వచ్చింది. రూ.20 లక్షలకు ఆర్సీబీ అతడిని సొంతం చేసుకుంది. 2021లో 4 మ్యాచ్లలో 71 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తర్వాతి సీజన్కు అతడిని అట్టిపెట్టుకోలేదు. 2022 వేలంలో రజత్ను ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 2022 సీజన్ ముందు లవ్నీత్ సిసోడియా గాయపడడంతో.. అతడి స్థానంలో రూ.20 లక్షలకే రజత్ను ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది. ఆ సీజన్లో మెరుపులు మెరిపించాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నోపై 54 బంతుల్లోనే 112 పరుగులు బాదాడు. గాయం వల్ల 2023 సీజన్కు అతడు దూరమయ్యాడు.
Also Read
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
2024 పునరాగమనం చేసిన రజత్ పటీదార్ 15 మ్యాచ్ల్లో 30.38 సగటు, 177.13 స్ట్రైక్ రేట్తో 395 పరుగులు చేశాడు. విధ్వంసక బ్యాటింగ్ కారణంగా అతడిని 2025 సీజన్ కోసం రూ.11 కోట్లకు ఆర్సీబీ అట్టిపెట్టుకుంది. 2024లో జట్టును నడిపించిన ఫాఫ్ డుప్లెసిస్ను ఈసారి కొనుగోలుచేయలేదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టులో ఉన్నప్పటికీ.. భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యాలు పోటీలో ఉన్నా.. కెప్టెన్సీ పటీదార్కు దక్కింది. మూడేళ్ల ముందు ఐపీఎల్లో అమ్ముడే కాని ఆటగాడు.. ఇప్పుడు రూ.11 కోట్లకు అట్టిపెట్టుకోవడం, కెప్టెన్గా మారడం విశేషం. ఇప్పటిదాకా 27 ఐపీఎల్ మ్యాచ్లలో 34.74 సగటుతో 799 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
-
Tollywood: మళ్లీ ట్రెండ్లోకి రాయలసీమ యాస.. స్టార్ హీరోల కొత్త ట్రెండ్ ఇదేనా ?
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!