Wife Exchange:‘వైఫ్ స్వాపింగ్’ గేమ్కు ఒప్పుకోలేదని కీచకుడిగా మారిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Exchange: భారత దేశం సంప్రదాయాలకు పుట్టినిల్లు. పాశ్చాత్య ధోరణులకు పోయి మన దేశ సంస్కృతిని కొందరు భ్రష్టు పట్టిస్తున్నారు. ఆ కోవకు చెందినదే ఈ వార్త.. ఓ భర్త కట్టుకున్న భార్యను మరో పురుడికి పడక సుఖం ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అంటే భార్య మార్పిడి క్రీడ(వైఫ్ స్వాపింగ్ గేమ్) ఆడాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె ససేమిరా అంది. అంతే ఆ కసాయి భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హోటల్ గదిలో బంధించి దాడి చేశాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్లో వెలుగు చూసింది.
Read Also: New CJI: కొత్త సీజేఐ నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
రాజస్థాన్లోని బికనీర్లో భార్యల మార్పిడికి సంబంధించిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒకరిభార్యను మరొకరికి ఇచ్చిపుచ్చుకునే ఈ ఆటలో పాల్గొనడానికి తాను నిరాకరించినందుకు తన భర్త తనపై క్రూరత్వానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించింది. ఈ ఘటనలో గేమ్లో పాల్గొనలేదనే కోపంతో బాధితురాలిని తన భర్తను కొట్టినట్లు కేసును విచారణ చేస్తున్న అధికారులు తెలిపారు. రాజస్థాన్లోని బికనీర్లోని ఓ హోటల్ గదిలో ఈ ఘటన జరగ్గా, భోపాల్లో కేసు నమోదైంది. ఫిర్యాదు చేసిన మహిళ భర్త బికనీర్లోని 5-స్టార్ హోటల్లో మేనేజర్గా ఉన్నారు. పోలీసుల ఫిర్యాదు మేరకు నిందితుడు అమ్మర్ (భర్త) తనను హోటల్ గదిలోకి లాక్కెళ్లి ఫోన్ తీసుకెళ్లాడని బాధితురాలు తెలిపింది. రెండు రోజుల తర్వాత మద్యం మత్తులో అక్కడికి చేరుకున్నాడు. మద్యం సేవించి, డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నాడు. తన భర్త ద్విలింగ సంపర్కుడని ఫిర్యాదుదారు తెలిపారు. తాను తన భర్త ప్రవర్తనతో బాధపడ్డానని, కానీ భార్య మార్పిడి గేమ్ కు మాత్రం ఒప్పుకోలేదని తెలిపింది.
Read Also: Tesla Pi Phone: అదిరిపోయే ఫీచర్స్తో మార్కెట్లోకి టెస్లా స్మార్ట్ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే..?
మహిళ అత్త, మామ, భర్త ఆమె నుంచి రూ.50 లక్షలు కట్నం డిమాండ్ చేశారు. తన భర్త ఘాతుకాల గురించి ఆమె అత్తమామలకు చెప్పింది. కానీ వారు దానిని పట్టించుకోలేదు. పైగా, అది లేటెస్ట్ ట్రెండ్ అంటూ వెనకేసుకొచ్చారు. తన భర్త లైంగిక దాడి తర్వాత తనకు గాయాలు అయ్యాయని, దాంతో తన ఆరోగ్యం క్షీణించిందని మహిళ తెలిపింది. ఇలాంటి దాడులు ఆమెపై నెలల పాటు కొనసాగాయి. అనంతరం బంధువులు వచ్చి ఆమెను పుట్టింటికి తీసుకొని వెళ్లారు. దీంతో అక్కడికి వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 377, 498-ఎ (వధువు వేధింపులు), 323, 506, 34, 3/4 సెక్షన్ల కింద నిందితుడైన భర్త, అత్త, ఆమె కోడలుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!