PAN Card: మీ పాన్ కార్డు ఎవరు వాడుతున్నారో తెలుసుకోండి.. రాజస్తాన్లో ఇలాగే జరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAN Card: ఆధునిక ప్రపంచంలో ప్రతీ ఒక్కరు మీ పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి. లేకపోతే మీకు సంబంధం లేకుండానే మీరు చిక్కుల్లో పడతారు. అలాంటి ఘటనే రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. తన పాన్ కార్డును వేరే వాళ్లు వాడడం మూలంగా ఐటీ శాఖ ఓ వ్యక్తిని బాధ్యుడిని చేసి నోటీసులు పంపించింది.
వివరాల్లోకి వెళ్లితే.. రాజస్థాన్లోని భిల్వారా ప్రాంతంలో 12.23 కోట్ల లావాదేవీకి సంబంధించి వికలాంగ స్టేషనరీ దుకాణదారుడికి ఆదాయపు పన్ను నోటీసు జారీ చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ దుకాణదారుడు అంత మొత్తంలో లావాదేవీలేమీ చేయలేదు. అయితే ఆదాయపు పన్ను శాఖ నోటీసు ఎందుకు పంపింది? దీని వెనుక కారణం ఏమిటో అతనికి తెలియలేదు. కిషన్ గోపాల్ చాపర్వాల్ నోటీసును మళ్లీ మళ్లీ చదివినప్పుడు, తన పేరు మీద నోటీసు జారీ చేసినట్లు వచ్చినది నిజమేనని గ్రహించాడు. అనంతరం ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.. అప్పుడు ఎవరో తన పాన్ కార్డును దుర్వినియోగం చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
Read Also: Covid 19: కరోనా కేసుల పెరుగుదలకు కారణం అవుతున్న XBB1.16 వేరియంట్.. లక్షణాలివే..
ఓ మీడియా సమాచారం ప్రకారం.. రాజస్థాన్లోని భిల్వారాలోని సంజయ్నగర్లో నివసిస్తున్న 38 ఏళ్ల కిషన్ గోపాల్ చపర్వాల్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను చార్టర్డ్ అకౌంటెంట్ వద్దకు వెళ్లగా.. పాన్ కార్డు దుర్వినియోగం అయ్యిందని.. ముంబై, సూరత్లోని రెండు డైమండ్ కంపెనీలు దుర్వినియోగం చేశాయని చెప్పాడు. ఈ కంపెనీల ద్వారా కోట్ల రూపాయల మార్పిడి జరిగింది.
కిషన్ చాపర్వాల్ షాపు ప్రారంభించడానికి అప్పు తీసుకున్నాడు. కానీ ఇప్పటికీ రుణం చెల్లించడంలో సమస్య ఏర్పడింది. తనకు దుకాణంలో వచ్చే సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోతున్నాయి. చేతిలో ఏమీ మిగలడం లేదు. కాబట్టి ఇన్ని కోట్లతో తనకు ఏ సంబంధం లేదని… నకిలీ కంపెనీలు పెట్టి పాన్ కార్డు ద్వారా మోసపోయానని వాపోయాడు.
Read Also: Sreeleela: ఈ కన్నడ బ్యూటీ క్రేజ్ ని తెగ వాడేస్తున్నారుగా…
ఈ లావాదేవీకి సంబంధించి సమాధానం చెప్పాలంటూ కిషన్ గోపాల్కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. అలాగే, 12.23 కోట్ల లావాదేవీల విషయంలో వివరాలను సమర్పించాలని కోరింది. పాన్ కార్డును ఎవరు వాడుతున్నారో తనకు తెలియదన్నారు. అలాగే, ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలని కిషన్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై సుభాష్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..