PAN Card: మీ పాన్ కార్డు ఎవరు వాడుతున్నారో తెలుసుకోండి.. రాజస్తాన్లో ఇలాగే జరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAN Card: ఆధునిక ప్రపంచంలో ప్రతీ ఒక్కరు మీ పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి. లేకపోతే మీకు సంబంధం లేకుండానే మీరు చిక్కుల్లో పడతారు. అలాంటి ఘటనే రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. తన పాన్ కార్డును వేరే వాళ్లు వాడడం మూలంగా ఐటీ శాఖ ఓ వ్యక్తిని బాధ్యుడిని చేసి నోటీసులు పంపించింది.
వివరాల్లోకి వెళ్లితే.. రాజస్థాన్లోని భిల్వారా ప్రాంతంలో 12.23 కోట్ల లావాదేవీకి సంబంధించి వికలాంగ స్టేషనరీ దుకాణదారుడికి ఆదాయపు పన్ను నోటీసు జారీ చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ దుకాణదారుడు అంత మొత్తంలో లావాదేవీలేమీ చేయలేదు. అయితే ఆదాయపు పన్ను శాఖ నోటీసు ఎందుకు పంపింది? దీని వెనుక కారణం ఏమిటో అతనికి తెలియలేదు. కిషన్ గోపాల్ చాపర్వాల్ నోటీసును మళ్లీ మళ్లీ చదివినప్పుడు, తన పేరు మీద నోటీసు జారీ చేసినట్లు వచ్చినది నిజమేనని గ్రహించాడు. అనంతరం ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.. అప్పుడు ఎవరో తన పాన్ కార్డును దుర్వినియోగం చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
Also Read
- Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
- Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
- Ind Vs SL: ఊహించని రీతిలో రెచ్చిపోయిన శ్రీలంక బ్యాటర్స్.. చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లు..
- Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్నినో ప్రభావం’..
Read Also: Covid 19: కరోనా కేసుల పెరుగుదలకు కారణం అవుతున్న XBB1.16 వేరియంట్.. లక్షణాలివే..
ఓ మీడియా సమాచారం ప్రకారం.. రాజస్థాన్లోని భిల్వారాలోని సంజయ్నగర్లో నివసిస్తున్న 38 ఏళ్ల కిషన్ గోపాల్ చపర్వాల్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను చార్టర్డ్ అకౌంటెంట్ వద్దకు వెళ్లగా.. పాన్ కార్డు దుర్వినియోగం అయ్యిందని.. ముంబై, సూరత్లోని రెండు డైమండ్ కంపెనీలు దుర్వినియోగం చేశాయని చెప్పాడు. ఈ కంపెనీల ద్వారా కోట్ల రూపాయల మార్పిడి జరిగింది.
కిషన్ చాపర్వాల్ షాపు ప్రారంభించడానికి అప్పు తీసుకున్నాడు. కానీ ఇప్పటికీ రుణం చెల్లించడంలో సమస్య ఏర్పడింది. తనకు దుకాణంలో వచ్చే సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోతున్నాయి. చేతిలో ఏమీ మిగలడం లేదు. కాబట్టి ఇన్ని కోట్లతో తనకు ఏ సంబంధం లేదని… నకిలీ కంపెనీలు పెట్టి పాన్ కార్డు ద్వారా మోసపోయానని వాపోయాడు.
Read Also: Sreeleela: ఈ కన్నడ బ్యూటీ క్రేజ్ ని తెగ వాడేస్తున్నారుగా…
ఈ లావాదేవీకి సంబంధించి సమాధానం చెప్పాలంటూ కిషన్ గోపాల్కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. అలాగే, 12.23 కోట్ల లావాదేవీల విషయంలో వివరాలను సమర్పించాలని కోరింది. పాన్ కార్డును ఎవరు వాడుతున్నారో తనకు తెలియదన్నారు. అలాగే, ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలని కిషన్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై సుభాష్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
-
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
-
Ind Vs SL: ఊహించని రీతిలో రెచ్చిపోయిన శ్రీలంక బ్యాటర్స్.. చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లు..
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!