PAN Card: మీ పాన్ కార్డు ఎవరు వాడుతున్నారో తెలుసుకోండి.. రాజస్తాన్లో ఇలాగే జరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAN Card: ఆధునిక ప్రపంచంలో ప్రతీ ఒక్కరు మీ పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి. లేకపోతే మీకు సంబంధం లేకుండానే మీరు చిక్కుల్లో పడతారు. అలాంటి ఘటనే రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. తన పాన్ కార్డును వేరే వాళ్లు వాడడం మూలంగా ఐటీ శాఖ ఓ వ్యక్తిని బాధ్యుడిని చేసి నోటీసులు పంపించింది.
వివరాల్లోకి వెళ్లితే.. రాజస్థాన్లోని భిల్వారా ప్రాంతంలో 12.23 కోట్ల లావాదేవీకి సంబంధించి వికలాంగ స్టేషనరీ దుకాణదారుడికి ఆదాయపు పన్ను నోటీసు జారీ చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ దుకాణదారుడు అంత మొత్తంలో లావాదేవీలేమీ చేయలేదు. అయితే ఆదాయపు పన్ను శాఖ నోటీసు ఎందుకు పంపింది? దీని వెనుక కారణం ఏమిటో అతనికి తెలియలేదు. కిషన్ గోపాల్ చాపర్వాల్ నోటీసును మళ్లీ మళ్లీ చదివినప్పుడు, తన పేరు మీద నోటీసు జారీ చేసినట్లు వచ్చినది నిజమేనని గ్రహించాడు. అనంతరం ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.. అప్పుడు ఎవరో తన పాన్ కార్డును దుర్వినియోగం చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
Also Read
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
Read Also: Covid 19: కరోనా కేసుల పెరుగుదలకు కారణం అవుతున్న XBB1.16 వేరియంట్.. లక్షణాలివే..
ఓ మీడియా సమాచారం ప్రకారం.. రాజస్థాన్లోని భిల్వారాలోని సంజయ్నగర్లో నివసిస్తున్న 38 ఏళ్ల కిషన్ గోపాల్ చపర్వాల్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను చార్టర్డ్ అకౌంటెంట్ వద్దకు వెళ్లగా.. పాన్ కార్డు దుర్వినియోగం అయ్యిందని.. ముంబై, సూరత్లోని రెండు డైమండ్ కంపెనీలు దుర్వినియోగం చేశాయని చెప్పాడు. ఈ కంపెనీల ద్వారా కోట్ల రూపాయల మార్పిడి జరిగింది.
కిషన్ చాపర్వాల్ షాపు ప్రారంభించడానికి అప్పు తీసుకున్నాడు. కానీ ఇప్పటికీ రుణం చెల్లించడంలో సమస్య ఏర్పడింది. తనకు దుకాణంలో వచ్చే సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోతున్నాయి. చేతిలో ఏమీ మిగలడం లేదు. కాబట్టి ఇన్ని కోట్లతో తనకు ఏ సంబంధం లేదని… నకిలీ కంపెనీలు పెట్టి పాన్ కార్డు ద్వారా మోసపోయానని వాపోయాడు.
Read Also: Sreeleela: ఈ కన్నడ బ్యూటీ క్రేజ్ ని తెగ వాడేస్తున్నారుగా…
ఈ లావాదేవీకి సంబంధించి సమాధానం చెప్పాలంటూ కిషన్ గోపాల్కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. అలాగే, 12.23 కోట్ల లావాదేవీల విషయంలో వివరాలను సమర్పించాలని కోరింది. పాన్ కార్డును ఎవరు వాడుతున్నారో తనకు తెలియదన్నారు. అలాగే, ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలని కిషన్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై సుభాష్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..