Rajasthan CM: కాంగ్రెస్ మునిగే నావ.. ఆ పార్టీకి ఒక్కసీటు కూడా రాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ అని.. ఆ పార్టీకి రాష్ట్రంలో ఒక్కసీటు కూడా రాదని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఆయా పార్టీలకు చెందిన నాయకులు కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భజన్లాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజస్థాన్లో ఉన్న 25 లోక్సభ సీట్లను బీజేపీనే గెలుచుకుంటుందని భజన్లాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో మరోసారి బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. ముచ్చటగా మూడోసారి మోడీ దేశ ప్రధాని కాబోతున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీలో ఉంటేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందన్న ఆలోచనతోనే ప్రతిపక్షాలకు చెందిన నేతలు పార్టీలో చేరుతున్నారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ అని.. అయినా మునుగుతున్న పడవలో ఎవరైనా కూర్చుంటారా? అని ఆయన ప్రశ్నించారు. అందుకే ఇతర ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీలో చేరికలు జరుగుతున్నాయని అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లో బీజేపీ మొత్తం 25 లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని చెప్పారు. 25 స్థానాల్లో కేవలం గెలువడమే కాదు.. భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఎన్డీఏ కూటమికి 400కు పైగా స్థానాలను గెలుస్తుందని భజన్లాల్ చెప్పుకొచ్చారు.
మరికొద్ది రోజుల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేఫన్ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ ప్రారంభమై.. జూన్ 1న ఏడో విడత పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఇదిలా ఉంటే ఈసారి ఎన్డీఏ కూటమికి 400 సీట్లు కట్టబెట్టాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా సౌతిండియాపై దృష్టి పెట్టిన మోడీ.. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ధి కోసం, వికసిత్ భారత్ కోసమే ఎన్డీఏకు 400 సీట్లు ఇవ్వాలని దేశ ప్రజలకు మోడీ విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!