Rajasthan Elections 2023: రాజస్థాన్లో ఓటేసిన ప్రముఖులు.. 9 గంటల వరకు 9.77 శాతం పోలింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
9.77% voting till 9 am in Rajasthan: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనాలు బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 9.77 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. తొలి 2 గంటల్లో చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ జైపుర్లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. టోంక్ స్థానం నుంచి సచిన్ పైలట్ పోటీ చేస్తున్నారు. ఝలావర్లోని పోలింగ్ బూత్లో బీజేపీ నాయకురాలు, మాజీ సీఎం వసుంధర రాజే ఓటు హక్కుని వినియోగించుకున్నారు. బీజేపీ నాయకుడు గజేంద్ర సింగ్ షెకావత్ కుటుంబ సమేతంగా జోధ్పుర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్, కేంద్ర మంత్రి కైలాశ్ చౌధరీ, బీజేపీ ఎంపీ సుభాష్ చంద్ర బహేరియా, బీజేపీ ఎంపీ దియా కుమారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Also Read
- Liquor Ban: ఏంటి!! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
రాజస్థాన్లో మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 199 స్థానాలకు ఒకే విడతలో నేడు పోలింగ్ జరుగుతోంది. శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్పూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి హఠాన్మరణంతో పోలింగ్ వాయిదా పడింది. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 1,862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాజస్థాన్లో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దించగా.. కాంగ్రెస్ పార్టీ భరత్పూర్ స్థానాన్ని మిత్రపక్షం రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ)కి కేటాయించింది.
రాజస్థాన్లో కాంగ్రెస్, బీజేపీతో పాటు సీపీఎం, ఆర్ఎల్పీ, భారత్ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తదితర పార్టీలు పోటీకి దిగాయి. పెద్ద సంఖ్యలో తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దిగడంతో కాంగ్రెస్, బీజేపీలకు ఆందోళన కలిగిస్తోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య ప్రస్తుతం హోరాహోరీ పోరు సాగుతోంది.
#RajasthanElections2023#SachinPilot pic.twitter.com/4FuUZSI6Mu
— Ravi Sisodia ರವಿ (@ravi27kant) November 25, 2023
తాజావార్తలు
-
Liquor Ban: ఏంటి!! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!