ATM Thief’s: 1 నుంచి 8వ తేదీ వరకు మోసాలు.. ఆపై సొంత వ్యాపారాలు, జల్సాలతో బిజీ బిజీ!
- ప్రతి నెల మొదటి 8 రోజులు మోసాలు
- ఆపై సొంత వ్యాపారాలు, జల్సాలు
- అనుమానం వస్తే 112 నెంబర్ కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1 నుంచి 8వ తేదీ వరకు ప్రతి నెల మొదటి 8 రోజులు మోసాలకు పాల్పడి.. ఆ తరువాత సొంత వ్యాపారాలు, జల్సాలతో గడుపుతున్న ఇద్దరు అంతః రాష్ట్ర మోసగాళ్లను రాజమండ్రి పోలీసులు అరెస్టు చేశారు. మొదటి 8 రోజులే ఎందుకంటే.. ఆ తరువాత పెన్షనర్ల వద్ద డ్రా చేసేందుకు డబ్బులుండవన్నది వీరి ఉద్దేశం. ఈ ఇద్దరూ ఏటీఎంల వద్ద కాపు కాసి నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులకు అందిన ఫిర్యాదుల మేరకు విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామానికి చెందిన చల్లమూరు వెంకట భాస్కరరావు, పొన్నాడ కిరణ్ లను రాజమండ్రి మోరంపూడి జంక్షన్ వద్ద నిఘా ఉంచి అరెస్టు చేశారు. వీరి నుంచి 2లక్షల 6వేల నగదు, 23 ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాజమండ్రిలోని ప్రకాష్ నగర్, టూటౌన్, రాజానగరం, రావులపాలెం పోలీసుస్టేషన్ల పరిధిలో భాస్కరరావు, కిరణ్ కలిసి ఏటీఎం మోసాలకు పాల్పడ్డారు. వీరిని తొలిసారిగా రాజమండ్రి పోలీసులే అరెస్టు చేయడం విశేషం. గతంలో విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో కూడా 15 మోసాలకు పాల్పడినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ ఇద్దరు నిందితులు ఏటీఎంల వద్ద మాటు వేసి, అమాయకులైన వ్యక్తులను టార్గెట్ చేస్తారు. నగదు డ్రా చేసుకునేందుకు సహాయం చేస్తున్నట్లు నటించి, కార్డు పనిచేయడం లేదని ఎంతో చాకచక్యంగా తమ వద్ద ఉన్న ఏటీఎంను ఇచ్చి కార్డును కాజేస్తారు. అప్పటికే పిన్ నెంబర్ తీసుకుని ఉండటంతో అమయాకులైన వీరి కార్డులను వినియోగించి నగదును డ్రా చేసుకుంటారు.
Also Read
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
నెలలో 8 రోజుల పాటు మాత్రమే ఈ మోసాలకు పాల్పడే భాస్కర్, కిరణ్ లు మిగిలిన రోజుల్లో సొంత వ్యాపారాలు, జల్సాలు చేసుకుంటారు. క్రికెట్ బెట్టింగ్ వ్యసనం వల్లే వీరు ఈమోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలాంటి మోసగాళ్లను దృష్టిలో ఉంచుకుని ఏటీఎంల వద్ద అపరిచితులను నమ్మవద్దని, అనుమానం వస్తే 112 నెంబర్ కు ఫోన్ చేయాలని రాజమండ్రి సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
-
Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
-
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!