Business News: ఇన్వెస్టర్లపై కాసుల వర్షం.. ఒక్క సెకనులో రూ.3 లక్షల కోట్ల లాభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సందర్భంగా స్టాక్ మార్కెట్లో అద్భుతమైన ప్రారంభం కనిపించింది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత బీఎస్ఈ ప్రధాన సూచీ 65,418.98 పాయింట్లకు చేరుకుంది. దీని వల్ల ఇన్వెస్టర్లు రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆర్జించారు. అయితే మార్కెట్ ప్రారంభమైన 6 నిమిషాల్లోనే 345.26 పాయింట్ల లాభంతో 65,235.78 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో టాప్ 30 షేర్లు గ్రీన్ మార్క్లో ట్రేడవుతున్నాయి. ఇటు.. ఐటీ కంపెనీల్లో మంచి వృద్ధి కనిపిస్తోంది. మరోవైపు, నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా పెరుగుదతో 19500 పాయింట్లకు పైగా పెరుగుదలతో ట్రేడవుతోంది.
Team India: రోహిత్, కోహ్లీ బౌలింగ్ చేయాలన్న ఫ్యాన్స్.. కోరిక తీర్చిన విరాట్
Also Read
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
స్టాక్ మార్కెట్లోని ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ రెండింటిలోనూ మంచి వృద్ధి కనిపిస్తోంది. బాంబే స్టాక్ ఎక్చేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 364 పాయింట్ల లాభంతో 65,268.84 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంతో 65,418.98 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన సూచీ నిఫ్టీ 113.10 పాయింట్ల లాభంతో 19,538.45 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కాగా, నేడు నిఫ్టీ 19,547.25 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో కోల్ ఇండియా షేర్లలో దాదాపు 4 శాతం పెరుగుదల కనిపిస్తోంది. యూపీఎల్ షేర్లు ఒకటిన్నర శాతానికి పైగా పెరుగుదలతో ట్రేడవుతున్నాయి. ఒఎన్జిసి, ఇన్ఫోసిస్, ఎన్టిపిసి షేర్లు ఒక శాతానికి పైగా పెరిగాయి. బీపీసీఎల్, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈలో ఇన్ఫోసిస్, విప్రో షేర్లలో మంచి పెరుగుదల కనిపిస్తోంది. రిలయన్స్ షేర్లు రూ.2329 కంటే ఎక్కువగా ట్రేడవుతున్నాయి. టాటా గ్రూపునకు చెందిన టైటాన్, టీసీఎస్, టాటా స్టీల్ షేర్లలో పెరుగుదల ఉంది.
Team India: రోహిత్, కోహ్లీ బౌలింగ్ చేయాలన్న ఫ్యాన్స్.. కోరిక తీర్చిన విరాట్
స్టాక్ మార్కెట్ ఓపెన్ అయిన తీరు వల్ల మార్కెట్ ప్రారంభమైన వెంటనే ఇన్వెస్టర్లు రూ.3 లక్షల కోట్లు ఆర్జించారు. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.3,20,29,232.24 కోట్లుగా ఉంది. కాగా ఈరోజు మార్కెట్ ప్రారంభమైన వెంటనే మార్కెట్ క్యాప్ రూ.3,23,38,359.97 కోట్లకు చేరుకుంది. అంటే ఒక్క సెకనులో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.3,09,127.73 కోట్లు పెరిగింది. ఇది పెట్టుబడిదారుల ఆదాయం.
తాజావార్తలు
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
-
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..