MK Stalin: నెహ్రూ వారసుడి మాటలు.. గాడ్సే వారసులను రెచ్చగొడుతున్నాయి.
Rahul Gandhi’s Speeches During Yatra Creating Tremors In India says MK stalin: భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఆయన చేస్తున్న ప్రసంగాలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని అన్నారు. లౌకికవాదం, సమానత్వం వంటి విలువలను కాపాడేందుకు దేశానికి నెహ్రూ, గాంధీల వంటి నాయకులు అసవరం అని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేత ఏ గోపన్న రాసిన ‘మమనితార్ నెహ్రూ’ పుస్తకాన్ని చెన్నైలో విడుదల చేసిన ఆయన నెహ్రూపై ప్రశంసలు గుప్పించారు. నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్యవాది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రతీక. అందుకే అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఆయనను కీర్తిస్తున్నాయని అన్నారు.
ప్రస్తుతం పార్లమెంట్ లో ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదని బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడుతునప్పుడు.. ఇప్పుడు మనకు నెహ్రూ గుర్తుకు వస్తున్నారని అన్నారు. తమిళనాడుకు పెరియార్, అన్నాదురై, కలైంజర్(కరుణానిధి) లాగే దేశంలో సమాఖ్య, సమానత్వం, లౌకికవాదాన్ని పెంపొందించడానికి గాంధీ, నెహ్రూ వంటి నాయకులు అవసరం అని అన్నారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Read Also: Pakistan: బలూచిస్థాన్లో పలు చోట్ల బాంబు పేలుళ్లు.. ఐదుగురు సైనికులు దుర్మరణం
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రసంగాలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని.. ఆయన ఎన్నికల రాజకీయాలు, పార్టీ రాజకీయాలకు దూరంగా భావజాలంపైనే మాట్లాడుతున్నారని.. అందుకే ఆయన్ను కొందరు వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఆయన ప్రసంగాలు కొన్ని సార్లు నెహ్రూలా ఉంటాయని కితాబిచ్చారు. నెహ్రూ వారసుడి వ్యాఖ్యలు, గాడ్సే వారసులకు చిరాకు తెప్పిస్తున్నాయని అన్నారు.
నెహ్రూ కేవలం కాంగ్రెస్ వ్యక్తి మాత్రమే కానది.. భారతదేశం గొంతుకలా ప్రతిధ్వనించారని.. భారతదేశానికి మొత్తానికి ప్రధాన మంత్రి అని.. ఆయన ఒక ఒక భాష, ఒక విశ్వాసం, ఒక మతం, ఒక సంస్కృతి, ఒకే చట్టానికి వ్యతిరేకం అని.. మతతత్వం, జాతీయవాదం ఎప్పటికీ కలిసి ఉండవని ఆయన అన్నారని తెలిపారు. మహాత్మా గాంధీ స్వయంగా నెహ్రూను ప్రశంసించారని, నెహ్రూ నాయకత్వంలో దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని చెప్పారని స్టాలిన్ అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!