MK Stalin: నెహ్రూ వారసుడి మాటలు.. గాడ్సే వారసులను రెచ్చగొడుతున్నాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi’s Speeches During Yatra Creating Tremors In India says MK stalin: భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఆయన చేస్తున్న ప్రసంగాలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని అన్నారు. లౌకికవాదం, సమానత్వం వంటి విలువలను కాపాడేందుకు దేశానికి నెహ్రూ, గాంధీల వంటి నాయకులు అసవరం అని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేత ఏ గోపన్న రాసిన ‘మమనితార్ నెహ్రూ’ పుస్తకాన్ని చెన్నైలో విడుదల చేసిన ఆయన నెహ్రూపై ప్రశంసలు గుప్పించారు. నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్యవాది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రతీక. అందుకే అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఆయనను కీర్తిస్తున్నాయని అన్నారు.
ప్రస్తుతం పార్లమెంట్ లో ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదని బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడుతునప్పుడు.. ఇప్పుడు మనకు నెహ్రూ గుర్తుకు వస్తున్నారని అన్నారు. తమిళనాడుకు పెరియార్, అన్నాదురై, కలైంజర్(కరుణానిధి) లాగే దేశంలో సమాఖ్య, సమానత్వం, లౌకికవాదాన్ని పెంపొందించడానికి గాంధీ, నెహ్రూ వంటి నాయకులు అవసరం అని అన్నారు.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
Read Also: Pakistan: బలూచిస్థాన్లో పలు చోట్ల బాంబు పేలుళ్లు.. ఐదుగురు సైనికులు దుర్మరణం
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రసంగాలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని.. ఆయన ఎన్నికల రాజకీయాలు, పార్టీ రాజకీయాలకు దూరంగా భావజాలంపైనే మాట్లాడుతున్నారని.. అందుకే ఆయన్ను కొందరు వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఆయన ప్రసంగాలు కొన్ని సార్లు నెహ్రూలా ఉంటాయని కితాబిచ్చారు. నెహ్రూ వారసుడి వ్యాఖ్యలు, గాడ్సే వారసులకు చిరాకు తెప్పిస్తున్నాయని అన్నారు.
నెహ్రూ కేవలం కాంగ్రెస్ వ్యక్తి మాత్రమే కానది.. భారతదేశం గొంతుకలా ప్రతిధ్వనించారని.. భారతదేశానికి మొత్తానికి ప్రధాన మంత్రి అని.. ఆయన ఒక ఒక భాష, ఒక విశ్వాసం, ఒక మతం, ఒక సంస్కృతి, ఒకే చట్టానికి వ్యతిరేకం అని.. మతతత్వం, జాతీయవాదం ఎప్పటికీ కలిసి ఉండవని ఆయన అన్నారని తెలిపారు. మహాత్మా గాంధీ స్వయంగా నెహ్రూను ప్రశంసించారని, నెహ్రూ నాయకత్వంలో దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని చెప్పారని స్టాలిన్ అన్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!