Rahul Gandhi: రాహుల్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఎమర్జెన్సీగా వయనాడ్కు పయనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్రకు (Bharat Jodo Nyay Yatra) తాత్కాలిక బ్రేక్ పడింది. హుటాహుటిన ఆయన తన సొంత నియోజకవర్గం కేరళలోని వయనాడ్కు (Wayanad) బయల్దేరి వెళ్లారు. దీంతో ఆదివారం 3 గంటల వరకు యాత్ర వాయిదా పడింది.
రాహుల్ యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో (Varanasi) కొనసాగుతోంది. శుక్రవారమే భారత్ జోడో యాత్ర యూపీలోకి ప్రవేశించింది. ఈనెల 21 వరకు ఉత్తరప్రదేశ్లో యాత్ర కొనసాగనుంది. అయితే శనివారం వారణాసిలో యాత్ర కొనసాగుతుండగా.. వయనాడ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. వయనాడ్లో ఏనుగు దాడిలో మృతి చెందిన కుటుంబాన్ని రాహుల్ పరామర్శించనున్నారు. ఇందుకోసం రాహుల్ వారణాసి నుంచి వయనాడ్కు బయల్దేరి వెళ్తు్న్నారు.
Also Read
- Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
అటవీ శాఖకు చెందిన ఎకో-టూరిజం గైడ్ ఇటీవల ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడు కోజికోడ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ వయనాడ్ వెళ్తు్న్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’ ట్విట్టర్లో తెలియజేశారు.
రాహుల్ గాంధీ అత్యవసరంగా వయనాడ్లో వెళ్తున్నారని.. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ప్రారంభమవుతుందని వెల్లడించారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అన్ని రాష్ట్రాల్లో ఉత్సాహంగా సాగుతోంది. కార్యకర్తలను, ప్రజలను కలుసుకుని ఉత్తేజాన్ని నింపుతున్నారు. వచ్చే నెలలో ఈ యాత్ర ముగియనుంది.
वायनाड में @RahulGandhi की उपस्थिति की तत्काल आवश्यकता है। वह आज शाम 5 बजे वाराणसी से प्रस्थान कर रहे हैं। भारत जोड़ो न्याय यात्रा कल 18 फरवरी को दोपहर 3 बजे प्रयागराज में फिर से शुरू होगी।
Rahul Gandhi’s presence is required urgently in Wayanad. He is leaving this evening from…
— Jairam Ramesh (@Jairam_Ramesh) February 17, 2024
తాజావార్తలు
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!