Rahul Gandhi: రాహుల్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఎమర్జెన్సీగా వయనాడ్కు పయనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్రకు (Bharat Jodo Nyay Yatra) తాత్కాలిక బ్రేక్ పడింది. హుటాహుటిన ఆయన తన సొంత నియోజకవర్గం కేరళలోని వయనాడ్కు (Wayanad) బయల్దేరి వెళ్లారు. దీంతో ఆదివారం 3 గంటల వరకు యాత్ర వాయిదా పడింది.
రాహుల్ యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో (Varanasi) కొనసాగుతోంది. శుక్రవారమే భారత్ జోడో యాత్ర యూపీలోకి ప్రవేశించింది. ఈనెల 21 వరకు ఉత్తరప్రదేశ్లో యాత్ర కొనసాగనుంది. అయితే శనివారం వారణాసిలో యాత్ర కొనసాగుతుండగా.. వయనాడ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. వయనాడ్లో ఏనుగు దాడిలో మృతి చెందిన కుటుంబాన్ని రాహుల్ పరామర్శించనున్నారు. ఇందుకోసం రాహుల్ వారణాసి నుంచి వయనాడ్కు బయల్దేరి వెళ్తు్న్నారు.
Also Read
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
- West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
- Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
అటవీ శాఖకు చెందిన ఎకో-టూరిజం గైడ్ ఇటీవల ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడు కోజికోడ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ వయనాడ్ వెళ్తు్న్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’ ట్విట్టర్లో తెలియజేశారు.
రాహుల్ గాంధీ అత్యవసరంగా వయనాడ్లో వెళ్తున్నారని.. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ప్రారంభమవుతుందని వెల్లడించారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అన్ని రాష్ట్రాల్లో ఉత్సాహంగా సాగుతోంది. కార్యకర్తలను, ప్రజలను కలుసుకుని ఉత్తేజాన్ని నింపుతున్నారు. వచ్చే నెలలో ఈ యాత్ర ముగియనుంది.
वायनाड में @RahulGandhi की उपस्थिति की तत्काल आवश्यकता है। वह आज शाम 5 बजे वाराणसी से प्रस्थान कर रहे हैं। भारत जोड़ो न्याय यात्रा कल 18 फरवरी को दोपहर 3 बजे प्रयागराज में फिर से शुरू होगी।
Rahul Gandhi’s presence is required urgently in Wayanad. He is leaving this evening from…
— Jairam Ramesh (@Jairam_Ramesh) February 17, 2024
తాజావార్తలు
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!